ETV Bharat / state

Somu Veeraju : అన్నదాతలపై ప్రభుత్వానిది లోపభూయిష్ట విధానం : సోము వీర్రాజు

author img

By

Published : Jun 3, 2021, 9:51 PM IST

వ్యవసాయంపై అధికారులు, దళారుల దోపిడీని నిలువరించలేని వైకాపా సర్కార్.. రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. రైతుల నుంచి గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు చేసి తక్షణమే నగదు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సూక్ష్మ సేద్య విధానంలో ఉపయోగించే పరికరాలు అన్నదాతలకు సబ్సిడీతో ఇవ్వాలన్నారు. విధానపరమైన అంశాల్లో ప్రభుత్వానికి శ్రద్ద లేదని విమర్శించారు. వ్యవసాయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.

Somu Veeraju : అన్నదాతలపై ప్రభుత్వానిది లోపభూయిష్ట విధానం : సోము వీర్రాజు
Somu Veeraju : అన్నదాతలపై ప్రభుత్వానిది లోపభూయిష్ట విధానం : సోము వీర్రాజు
Somu Veeraju : అన్నదాతలపై ప్రభుత్వానిది లోపభూయిష్ట విధానం : సోము వీర్రాజు

అన్నదాతలపై ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం లోపభూయిష్టంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ, నగదు చెల్లింపు విధానంలో పరిపుష్టి లేదని విమర్శించారు. రైతుల నుంచి ఈ ఏడాది 45 లక్షల టన్నుల ధాన్యం కొనగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికీ రూ. 3,990 కోట్ల విలువైన 21 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించిందన్నారు. ధాన్యానికి నగదు చెల్లింపులు చేసే అంశంలో జాప్యం కొనసాగుతుందన్నారు. సకాలంలో సరైన మద్ధతు ధర ఇవ్వకపోవడంతోనే రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు తక్కువకే అమ్ముకుని దివాళా తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారితో సంయుక్త సమావేశం నిర్వహించాలి : సోము

ఈ రకంగా అన్నదాతలు ఏటా వేల కోట్లు నష్టపోతున్నారన్నారు. ఈ లోపభూయిష్ట విధానం మారాలని, వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించి యుద్ధప్రాతిపదికన సమస్యను పరిష్కరించాలన్నారు. మిల్లర్ల ప్రమేయాన్ని మిల్లింగ్​ వరకే పరిమితం చేయాలన్నారు. మైక్రో ఇరిగేషన్ వ్యవస్థను సైతం రాష్ట్ర సర్కార్ నిర్యక్షం చేసిందన్నారు. ప్రధానంగా రాయలసీమలో మాత్రమే ఈ విధానం ఎక్కువగా ఉందని.. గడిచిన రెండేళ్లలో ఒక్క ఎకరానికీ నీరివ్వలేదన్నారు. టెండర్లు సైతం పిలవలేదని, గత ప్రభుత్వం కంపెనీలకు ఇవ్వాల్సిన బకాయిలు జగన్ సర్కార్ చెల్లించకపోవడంతో పాటు ఈ ఏడాదీ చెల్లించలేదన్నారు.

పీఎంఏవై ఇళ్లకు మోదీ చిత్రం తప్పనిసరి..

ప్రధానమంత్రి అర్బన్ హౌసింగ్ యోజన పథకం ద్వారా రాష్ట్రంలో నిర్మించే ఇళ్లకు తప్పనిసరిగా ప్రధాని మోదీ చిత్రాన్ని వేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. పిఎంఏవై పథకం కేంద్రానిదని, రూ. 25 లక్షల నివాసాలను రాష్ట్రంలో నిర్మించేందుకు రాష్ట్ర భాజపా ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 15 లక్షల ఇళ్లనే నిర్మించగలమని అనుమతులు తీసుకుందన్నారు.

మోదీ ఫోటో లేకుంటే మేమే అమర్చుతాం: భాజపా

ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షల సబ్సిడీ, నరేగా నిధులు రూ. 30 వేలు కలిపి మొత్తం కలిపి రూ.1.80 లక్షల సబ్సిడీని కేంద్రం ఇస్తోందన్నారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకంగా చెప్పుకుని వైఎస్ఆర్ జగనన్న కాలనీలుగా వైకాపా ప్రచారం చేసుకుంటోందన్నారు. వీటికి తప్పనిసరిగా మోదీ ఫొటోను పెట్టాలని.. లేనిపక్షంలో తామే మోదీ చిత్రాలను అమర్చుతామన్నారు.

నగదు సహా సిమెంట్​ సబ్సిడీ ఇవ్వాలి..

పిఎంఏవై ఇళ్ల నిర్మాణాన్ని కాంట్రాక్టర్లకు కాకుండా హౌసింగ్ బోర్డు అధికారుల పర్యవేక్షణలో లబ్దిదారులే నిర్మించుకునేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. లబ్దిదారులకు నగదు సహా సిమెంట్​ను సబ్సిడీపై అందించాలని డిమాండ్ చేశారు. ఇటీవలే శంకుస్థాపన చేసిన మెడికల్ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల గురించి ముఖ్యమంత్రి ప్రజలకు తెలియచేయలని వీర్రాజు డిమాండ్ చేశారు. ఫాస్టర్లకు జీతాలు పెంచడం ప్రస్తుత సమయంలో అప్రాధాన్యమని, దీనిని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ అంశంపై కోర్టుకు వెళ్లి జీతాల పెంపుదల నిర్ణయాన్ని నిలుపుదల చేయిస్తామన్నారు.

ఇవీ చూడండి : Chandrababu: గృహ నిర్మాణ రంగంపై సీఎం జగన్​వి గాలి మాటలు​: చంద్రబాబు

Somu Veeraju : అన్నదాతలపై ప్రభుత్వానిది లోపభూయిష్ట విధానం : సోము వీర్రాజు

అన్నదాతలపై ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం లోపభూయిష్టంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ, నగదు చెల్లింపు విధానంలో పరిపుష్టి లేదని విమర్శించారు. రైతుల నుంచి ఈ ఏడాది 45 లక్షల టన్నుల ధాన్యం కొనగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికీ రూ. 3,990 కోట్ల విలువైన 21 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించిందన్నారు. ధాన్యానికి నగదు చెల్లింపులు చేసే అంశంలో జాప్యం కొనసాగుతుందన్నారు. సకాలంలో సరైన మద్ధతు ధర ఇవ్వకపోవడంతోనే రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు తక్కువకే అమ్ముకుని దివాళా తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారితో సంయుక్త సమావేశం నిర్వహించాలి : సోము

ఈ రకంగా అన్నదాతలు ఏటా వేల కోట్లు నష్టపోతున్నారన్నారు. ఈ లోపభూయిష్ట విధానం మారాలని, వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించి యుద్ధప్రాతిపదికన సమస్యను పరిష్కరించాలన్నారు. మిల్లర్ల ప్రమేయాన్ని మిల్లింగ్​ వరకే పరిమితం చేయాలన్నారు. మైక్రో ఇరిగేషన్ వ్యవస్థను సైతం రాష్ట్ర సర్కార్ నిర్యక్షం చేసిందన్నారు. ప్రధానంగా రాయలసీమలో మాత్రమే ఈ విధానం ఎక్కువగా ఉందని.. గడిచిన రెండేళ్లలో ఒక్క ఎకరానికీ నీరివ్వలేదన్నారు. టెండర్లు సైతం పిలవలేదని, గత ప్రభుత్వం కంపెనీలకు ఇవ్వాల్సిన బకాయిలు జగన్ సర్కార్ చెల్లించకపోవడంతో పాటు ఈ ఏడాదీ చెల్లించలేదన్నారు.

పీఎంఏవై ఇళ్లకు మోదీ చిత్రం తప్పనిసరి..

ప్రధానమంత్రి అర్బన్ హౌసింగ్ యోజన పథకం ద్వారా రాష్ట్రంలో నిర్మించే ఇళ్లకు తప్పనిసరిగా ప్రధాని మోదీ చిత్రాన్ని వేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. పిఎంఏవై పథకం కేంద్రానిదని, రూ. 25 లక్షల నివాసాలను రాష్ట్రంలో నిర్మించేందుకు రాష్ట్ర భాజపా ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 15 లక్షల ఇళ్లనే నిర్మించగలమని అనుమతులు తీసుకుందన్నారు.

మోదీ ఫోటో లేకుంటే మేమే అమర్చుతాం: భాజపా

ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షల సబ్సిడీ, నరేగా నిధులు రూ. 30 వేలు కలిపి మొత్తం కలిపి రూ.1.80 లక్షల సబ్సిడీని కేంద్రం ఇస్తోందన్నారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకంగా చెప్పుకుని వైఎస్ఆర్ జగనన్న కాలనీలుగా వైకాపా ప్రచారం చేసుకుంటోందన్నారు. వీటికి తప్పనిసరిగా మోదీ ఫొటోను పెట్టాలని.. లేనిపక్షంలో తామే మోదీ చిత్రాలను అమర్చుతామన్నారు.

నగదు సహా సిమెంట్​ సబ్సిడీ ఇవ్వాలి..

పిఎంఏవై ఇళ్ల నిర్మాణాన్ని కాంట్రాక్టర్లకు కాకుండా హౌసింగ్ బోర్డు అధికారుల పర్యవేక్షణలో లబ్దిదారులే నిర్మించుకునేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. లబ్దిదారులకు నగదు సహా సిమెంట్​ను సబ్సిడీపై అందించాలని డిమాండ్ చేశారు. ఇటీవలే శంకుస్థాపన చేసిన మెడికల్ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల గురించి ముఖ్యమంత్రి ప్రజలకు తెలియచేయలని వీర్రాజు డిమాండ్ చేశారు. ఫాస్టర్లకు జీతాలు పెంచడం ప్రస్తుత సమయంలో అప్రాధాన్యమని, దీనిని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ అంశంపై కోర్టుకు వెళ్లి జీతాల పెంపుదల నిర్ణయాన్ని నిలుపుదల చేయిస్తామన్నారు.

ఇవీ చూడండి : Chandrababu: గృహ నిర్మాణ రంగంపై సీఎం జగన్​వి గాలి మాటలు​: చంద్రబాబు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.