హైదరాబాద్ రాజేంద్రనగర్లో అల్లరిమూకలు అర్ధరాత్రి రెచ్చిపోయాయి. కొందరు సిక్కు యువకులు కత్తులు పట్టుకుని స్వైర విహారం చేయడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అత్తాపూర్లోని మారుతీనగర్లో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై పోయేవారిని దూషించారు. ఇరు వర్గాలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సిక్కు యువకులు కత్తులు పట్టుకుని తిరిగారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అల్లరి మూకలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి: ఏవోబీలో వారోత్సవాల కలకలం.. అప్రమత్తంగా పోలీసు యంత్రాంగం