ETV Bharat / state

అల్లరిమూకలు కత్తులతో స్వైర విహారం...భయాందోళనలో స్థానికులు - హైదరాబాద్​లో సిక్కుల ఘర్షణ

రాజేంద్రనగర్​లో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. అర్ధరాత్రి కత్తులతో కొందరు సిక్కు యువకులు స్వైర విహారం చేశారు. స్థానికులను దూషించడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఫలితంగా ఘర్షణ వాతావారణం నెలకొంది.

sikhs conflicts
అల్లరిమూకలు కత్తులతో స్వైర విహారం
author img

By

Published : Dec 2, 2020, 12:10 PM IST

అల్లరిమూకలు కత్తులతో స్వైర విహారం

హైదరాబాద్​ రాజేంద్రనగర్‌లో అల్లరిమూకలు అర్ధరాత్రి రెచ్చిపోయాయి. కొందరు సిక్కు యువకులు కత్తులు పట్టుకుని స్వైర విహారం చేయడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అత్తాపూర్‌లోని మారుతీనగర్‌లో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై పోయేవారిని దూషించారు. ఇరు వర్గాలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సిక్కు యువకులు కత్తులు పట్టుకుని తిరిగారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అల్లరి మూకలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి: ఏవోబీలో వారోత్సవాల కలకలం.. అప్రమత్తంగా పోలీసు యంత్రాంగం

అల్లరిమూకలు కత్తులతో స్వైర విహారం

హైదరాబాద్​ రాజేంద్రనగర్‌లో అల్లరిమూకలు అర్ధరాత్రి రెచ్చిపోయాయి. కొందరు సిక్కు యువకులు కత్తులు పట్టుకుని స్వైర విహారం చేయడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అత్తాపూర్‌లోని మారుతీనగర్‌లో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై పోయేవారిని దూషించారు. ఇరు వర్గాలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సిక్కు యువకులు కత్తులు పట్టుకుని తిరిగారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అల్లరి మూకలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి: ఏవోబీలో వారోత్సవాల కలకలం.. అప్రమత్తంగా పోలీసు యంత్రాంగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.