ETV Bharat / state

గనులశాఖ ముఖ్య కార్యదర్శి సంతకం ఫోర్జరీ.. నిందితుడిపై​ కేసు - ఘరానా మోసం : ఇసుక రీచ్‌లు లీజుకు ఇప్పిస్తామని రూ.3.5 కోట్లు వసూలు

ఘరానా మోసం : ఇసుక రీచ్‌లు లీజుకు ఇప్పిస్తామని రూ.3.5 కోట్లు వసూలు
ఘరానా మోసం : ఇసుక రీచ్‌లు లీజుకు ఇప్పిస్తామని రూ.3.5 కోట్లు వసూలు
author img

By

Published : Jun 10, 2021, 1:37 PM IST

Updated : Jun 10, 2021, 4:49 PM IST

13:31 June 10

ఇసుక రీచ్‌లు లీజుకు ఇప్పిస్తామని రూ.3.5 కోట్లు వసూలు

ఇసుక రీచ్‌లు సబ్​ లీజుకు ఇప్పిస్తానని కాకినాడ వాసి సతీశ్ ఘరానా మోసానికి తెరలేపాడు. రీచ్​లు కట్టబెటతామని పలువురి నుంచి రూ.3.5 కోట్లు వసూలు చేశారు. ఈ క్రమంలో గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించాడు. గోపాలకృష్ణ ద్వివేది సంతకం ఫోర్జరీ చేసిన సతీశ్‌... సంబంధించిన దస్త్రాలను సైతం ఏర్పాటు చేశాడు.  

సబ్​ రీచ్​లు ఇప్పిస్తానని..

కాకినాడకు చెందిన రామకృష్ణ సతీష్ కుమార్ తనకు జేపీ గ్రూప్ నుంచి ఇసుక రీచ్​ల కాంట్రాక్ట్ వచ్చిందని నమ్మిస్తూ పలువురి నుంచి భారీగా నగదు వసూలు చేశాడు. ఇసుక రీచ్​లను సబ్ లీజ్​కు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవటంతో.. బాధితులు విషయాన్ని జేపీ గ్రూప్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 

ఫోర్జరీ అని గుర్తించారు..

ఈ క్రమంలో నిందితుడు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది సంతకం ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించాడని గుర్తించారు. స్పందించిన జేపీ గ్రూప్ మేనేజర్ హర్షకుమార్ విజయవాడలోని భవానీపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సతీశ్ కోసం గాలిస్తున్నాం : పోలీసులు

అనంతరం కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏడుగురు నుంచి సుమారు రూ. 3.5 కోట్ల మేర నగదు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ ఇదే తరహాలోనే మరో పీఎస్​లోనూ కేసు నమోదైనట్లు వెల్లడించారు. 

ఇవీ చూడండి : జడ్జి రామకృష్ణ బెయిల్ పిటిషన్​పై విచారణ వాయిదా

13:31 June 10

ఇసుక రీచ్‌లు లీజుకు ఇప్పిస్తామని రూ.3.5 కోట్లు వసూలు

ఇసుక రీచ్‌లు సబ్​ లీజుకు ఇప్పిస్తానని కాకినాడ వాసి సతీశ్ ఘరానా మోసానికి తెరలేపాడు. రీచ్​లు కట్టబెటతామని పలువురి నుంచి రూ.3.5 కోట్లు వసూలు చేశారు. ఈ క్రమంలో గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించాడు. గోపాలకృష్ణ ద్వివేది సంతకం ఫోర్జరీ చేసిన సతీశ్‌... సంబంధించిన దస్త్రాలను సైతం ఏర్పాటు చేశాడు.  

సబ్​ రీచ్​లు ఇప్పిస్తానని..

కాకినాడకు చెందిన రామకృష్ణ సతీష్ కుమార్ తనకు జేపీ గ్రూప్ నుంచి ఇసుక రీచ్​ల కాంట్రాక్ట్ వచ్చిందని నమ్మిస్తూ పలువురి నుంచి భారీగా నగదు వసూలు చేశాడు. ఇసుక రీచ్​లను సబ్ లీజ్​కు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవటంతో.. బాధితులు విషయాన్ని జేపీ గ్రూప్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 

ఫోర్జరీ అని గుర్తించారు..

ఈ క్రమంలో నిందితుడు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది సంతకం ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించాడని గుర్తించారు. స్పందించిన జేపీ గ్రూప్ మేనేజర్ హర్షకుమార్ విజయవాడలోని భవానీపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సతీశ్ కోసం గాలిస్తున్నాం : పోలీసులు

అనంతరం కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏడుగురు నుంచి సుమారు రూ. 3.5 కోట్ల మేర నగదు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ ఇదే తరహాలోనే మరో పీఎస్​లోనూ కేసు నమోదైనట్లు వెల్లడించారు. 

ఇవీ చూడండి : జడ్జి రామకృష్ణ బెయిల్ పిటిషన్​పై విచారణ వాయిదా

Last Updated : Jun 10, 2021, 4:49 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.