వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు... ఆర్టీసీ, ప్రైవేటు బస్సు డ్రైవర్లకు ప్రమాదాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నందిగామ కీసర టోల్ గేట్ వద్ద డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో పలువురు పోలీసు సిబ్బంది ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌర్యం కలిగినా వెంటనే 100కు ఫోన్ చేసి తెలపాలని సూచించారు. అదేవిధంగా రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేశారు.
ఇదీచదవండి