ETV Bharat / state

"నా కొడుకు హత్యకేసును... పక్కదారి పట్టిస్తున్నారు!?"

విద్యార్థి ఆదిత్య హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పదో తరగతి విద్యార్థే బాలుడిని చంపేశాడని.. పోలీసులు నిర్ధారించారు. కానీ... ఆదిత్య తండ్రిమాత్రం తన కుమారిడి కేసును పోలీసులు కావాలనే పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంతకీ... ఆదిత్య హత్య విషయంలో అసలేం జరిగింది!?

author img

By

Published : Aug 7, 2019, 7:42 PM IST

"నా కొడుకు హత్యకేసును... పక్కదారి పట్టిస్తున్నారు!?"
కొడుకు హత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న తండ్రి
కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ బాలుర వసతిగృహంలో సోమవారం అర్ధరాత్రి బాలుడు దాసరి ఆదిత్య(8) దారుణ హత్యకు గురైన ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ పైశాచికానికి సూత్రధారి తోటి విద్యార్థేనని పోలీసులు తేల్చేశారు! 15ఏళ్లయినా నిండని బాలుడు కక్షతో తోటి చిన్నారిని కర్కశంగా గొంతుకోసి చంపాడని చెబుతున్నారు. అయితే.. ఈ విషయంతో తండ్రిమాత్రం ఏకీభవించడం లేదు.

దోషులను రక్షించే కుట్ర!

పోలీసులు కావాలనే దోషులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆదిత్య తండ్రి ఆరోపిస్తున్నారు. హాస్టల్ వార్డెన్, వాచ్​మెన్​కు తెలియకుండా హత్య జరిగే అవకాశమే లేదని చెబుతున్నారు.

"ఎప్పుడో నా కొడుకు తిట్టాడని.. అది మనసులో పెట్టుకునే హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. కానీ ఆ విషయం నమ్మశక్యంగా లేదు. అసలు విషయం హాస్టల్ వార్డెన్, వాచ్​మెన్​కు తెలుసు. అందుకే వారితో మాట్లాడటానికి మాకు అవకాశం కల్పించడం లేదు. హత్య చేసిన వ్యక్తులు వేరు... వారిని రక్షించేందుకే ఆ నెపాన్ని పదో తరగతి విద్యార్థిపై నెడుతున్నారు. సమగ్ర విచారణ జరపకుంటే... ఆందోళన చేస్తాం." - రవీంద్ర, ఆదిత్య తండ్రి

పోలీసులు ఏమంటున్నారంటే...

చల్లపల్లి బీసీ హాస్టల్లో ఆదిత్య మృతి చెందినప్పుడు రక్తపు మరకలు ఉన్న పదో తరగతి విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించామని అవనిగడ్డ డిఎస్పీ ఎం. రమేష్ రెడ్డి తెలిపారు. ఆదిత్య తల్లిదండ్రుల వాదన వేరేవిధంగా ఉంది కనుక... ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని చెప్పారు.

ఆదిత్యను హత్యచేసింది తోటి విద్యార్థియేనా... లేక అందులో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా! పోలీసులు చెబుతున్నదే నిజమా... లేక తల్లిదండ్రుల ఆరోపణే సత్యమా... అసలు విషయం బయటికి రావాలంటే.. పోలీసులు మరింత నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సిందే!?

సంబంధిత కథనం... సంఘర్షణల జీవనం... గతితప్పుతున్న బాల్యం!

కొడుకు హత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న తండ్రి
కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ బాలుర వసతిగృహంలో సోమవారం అర్ధరాత్రి బాలుడు దాసరి ఆదిత్య(8) దారుణ హత్యకు గురైన ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ పైశాచికానికి సూత్రధారి తోటి విద్యార్థేనని పోలీసులు తేల్చేశారు! 15ఏళ్లయినా నిండని బాలుడు కక్షతో తోటి చిన్నారిని కర్కశంగా గొంతుకోసి చంపాడని చెబుతున్నారు. అయితే.. ఈ విషయంతో తండ్రిమాత్రం ఏకీభవించడం లేదు.

దోషులను రక్షించే కుట్ర!

పోలీసులు కావాలనే దోషులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆదిత్య తండ్రి ఆరోపిస్తున్నారు. హాస్టల్ వార్డెన్, వాచ్​మెన్​కు తెలియకుండా హత్య జరిగే అవకాశమే లేదని చెబుతున్నారు.

"ఎప్పుడో నా కొడుకు తిట్టాడని.. అది మనసులో పెట్టుకునే హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. కానీ ఆ విషయం నమ్మశక్యంగా లేదు. అసలు విషయం హాస్టల్ వార్డెన్, వాచ్​మెన్​కు తెలుసు. అందుకే వారితో మాట్లాడటానికి మాకు అవకాశం కల్పించడం లేదు. హత్య చేసిన వ్యక్తులు వేరు... వారిని రక్షించేందుకే ఆ నెపాన్ని పదో తరగతి విద్యార్థిపై నెడుతున్నారు. సమగ్ర విచారణ జరపకుంటే... ఆందోళన చేస్తాం." - రవీంద్ర, ఆదిత్య తండ్రి

పోలీసులు ఏమంటున్నారంటే...

చల్లపల్లి బీసీ హాస్టల్లో ఆదిత్య మృతి చెందినప్పుడు రక్తపు మరకలు ఉన్న పదో తరగతి విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించామని అవనిగడ్డ డిఎస్పీ ఎం. రమేష్ రెడ్డి తెలిపారు. ఆదిత్య తల్లిదండ్రుల వాదన వేరేవిధంగా ఉంది కనుక... ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని చెప్పారు.

ఆదిత్యను హత్యచేసింది తోటి విద్యార్థియేనా... లేక అందులో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా! పోలీసులు చెబుతున్నదే నిజమా... లేక తల్లిదండ్రుల ఆరోపణే సత్యమా... అసలు విషయం బయటికి రావాలంటే.. పోలీసులు మరింత నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సిందే!?

సంబంధిత కథనం... సంఘర్షణల జీవనం... గతితప్పుతున్న బాల్యం!

Intro:ap_knl_91_7_valanteerlaku_shikhsana_av_ap10128... వాలంటీర్లకు ఎంపికైనవారు బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని ఎంపీడీవో వరలక్ష్మి పేర్కొన్నారు . మద్దికేర లోని సామూహిక భవనంలో బుధవారం ఎంపికైన వాలంటీర్లకు శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలతో ఉంటూ వారికి అవసరమైన సౌకర్యాలను కల్పించే దిశగా అడుగులు వేస్తూ ప్రభుత్వ లక్షాన్ని వారికి చేరువ చేయాలని ఆమె సూచించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర లో జరిగిన సమావేశంలో లో ఆమె మాట్లాడుతూ వాలంటీర్లు ప్రతి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించేందుకు నిరంతరం కృషి చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో లో పశు వైద్యాధికారి క్రిష్ణ నాయక్ ,పరిపాలన అధికారి విజయ లలిత, పంచాయతీ కార్యదర్శులు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.







Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా.


Conclusion:8008573822
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.