ETV Bharat / state

రూ.10 లక్షల పరిహారం పంపిణీకి ఉత్తర్వులు జారీ

author img

By

Published : May 19, 2021, 10:31 PM IST

కరోనా బారిన పడి తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోతే ఆ పిల్లలకు రూ. 10 లక్షలు ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. 18 సంవత్సరాలలోపు పిల్లలకే ఈ పరిహారం ఇస్తారని పేర్కొన్నారు.

కొవిడ్​తో తల్లిందండ్రులు మరణిస్తే ఇచ్చే రూ.10 లక్షల పరిహారానికి ఉత్తర్వులు జారీ
కొవిడ్​తో తల్లిందండ్రులు మరణిస్తే ఇచ్చే రూ.10 లక్షల పరిహారానికి ఉత్తర్వులు జారీ

కొవిడ్​తో తల్లిదండ్రులు మరణిస్తే పిల్లలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

వారికే వర్తిస్తుంది..

18 ఏళ్లలోపు వయసు ఉన్న పిల్లలకే ఈ పరిహారం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. తల్లిదండ్రులు ఇద్దరూ కొవిడ్ సోకి మరణిస్తేనే సాయం అందుతుందని స్పష్టం చేసింది. దారిద్రరేఖకు దిగువగా ఉన్న పేద కుటుంబాలకే సాయం పొందేందుకు అర్హులని వెల్లడించింది. అర్హుల ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో ఛైర్మన్​గా జిల్లా కలెక్టర్, సభ్యుడిగా డీఎంహెచ్​ఓ, మెంబర్ కన్వీనర్​గా శిశు సంక్షేమ శాఖ పీడీ ఉంటారని వివరించింది.

25 ఏళ్ల వయస్సు నిండాకే నగదు వెనక్కి..

వచ్చిన దరఖాస్తుల్లో అర్హతలను కమిటీ పరిశీలించి నిర్ణయిస్తుందని తెలిపింది. అనంతరం ఒక్కో బాధిత వ్యక్తి పేరిట జాతీయ బ్యాంకులో రూ.10 లక్షల పరిహారాన్ని ఫిక్స్​డ్ డిపాజిట్​గా వేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసిన అనంతరం బాధిత పిల్లలకు బాండు పత్రాలను అప్పగిస్తామని పేర్కొంది. వారికి 25 ఏళ్ల వయస్సు నిండాకే నగదును బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. డిపాజిట్ చేసిన డబ్బుకు నెల వారీగా లేదా మూడు నెలలకు ఓసారి వడ్డీ చెల్లించే ఏర్పాటు చేశామని.. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది.

ఇవీ చూడండి : జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆసుపత్రుల అభివృద్ధి: సీఎం

కొవిడ్​తో తల్లిదండ్రులు మరణిస్తే పిల్లలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

వారికే వర్తిస్తుంది..

18 ఏళ్లలోపు వయసు ఉన్న పిల్లలకే ఈ పరిహారం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. తల్లిదండ్రులు ఇద్దరూ కొవిడ్ సోకి మరణిస్తేనే సాయం అందుతుందని స్పష్టం చేసింది. దారిద్రరేఖకు దిగువగా ఉన్న పేద కుటుంబాలకే సాయం పొందేందుకు అర్హులని వెల్లడించింది. అర్హుల ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో ఛైర్మన్​గా జిల్లా కలెక్టర్, సభ్యుడిగా డీఎంహెచ్​ఓ, మెంబర్ కన్వీనర్​గా శిశు సంక్షేమ శాఖ పీడీ ఉంటారని వివరించింది.

25 ఏళ్ల వయస్సు నిండాకే నగదు వెనక్కి..

వచ్చిన దరఖాస్తుల్లో అర్హతలను కమిటీ పరిశీలించి నిర్ణయిస్తుందని తెలిపింది. అనంతరం ఒక్కో బాధిత వ్యక్తి పేరిట జాతీయ బ్యాంకులో రూ.10 లక్షల పరిహారాన్ని ఫిక్స్​డ్ డిపాజిట్​గా వేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసిన అనంతరం బాధిత పిల్లలకు బాండు పత్రాలను అప్పగిస్తామని పేర్కొంది. వారికి 25 ఏళ్ల వయస్సు నిండాకే నగదును బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. డిపాజిట్ చేసిన డబ్బుకు నెల వారీగా లేదా మూడు నెలలకు ఓసారి వడ్డీ చెల్లించే ఏర్పాటు చేశామని.. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది.

ఇవీ చూడండి : జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆసుపత్రుల అభివృద్ధి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.