ETV Bharat / state

నీటికుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

author img

By

Published : Jun 6, 2019, 3:11 AM IST

ఆటకని వెళ్లి నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా నంది వడ్డేమాన్​లో విషాదం నింపింది. తమ పిల్లలు ఇక లేరన్న నిజాన్ని తెలుసుకున్న బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరితో పాటు మరో చిన్నారి చనిపోవడం వల్ల గ్రామస్థులు శోక సంద్రంలో మునిగిపోయారు.

నాగర్ కర్నూలు

నీటికుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన చిన్నారులు అనిల్​ కుమార్​, స్వాతి అనే ఈతకని వెళ్లి నీటికుంటలో పడి మృతి చెందారు. వీరితో పాటు శైలజ అనే మరో చిన్నారి కూడా చనిపోయింది. గణేష్​ అనే చిన్నారిని స్థానికులు గుర్తించి కాపాడి... నాగర్​కర్నూల్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పిల్లల మృతితో గ్రామమంతా శోక సంద్రంలో మునిగిపోయింది.

నీటికుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన చిన్నారులు అనిల్​ కుమార్​, స్వాతి అనే ఈతకని వెళ్లి నీటికుంటలో పడి మృతి చెందారు. వీరితో పాటు శైలజ అనే మరో చిన్నారి కూడా చనిపోయింది. గణేష్​ అనే చిన్నారిని స్థానికులు గుర్తించి కాపాడి... నాగర్​కర్నూల్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పిల్లల మృతితో గ్రామమంతా శోక సంద్రంలో మునిగిపోయింది.

ఇదీ చూడండి : రైలు కింద పడి ఏఎస్​ఐ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.