ETV Bharat / state

కేడీ నంబర్ 1.. కేసులు 22... బాధితులు 128 మంది!

నిమిషాల్లో ఎదుటి వారిని తన మాటలతో ఆకర్షించటం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామని ఒక చోట.. ప్రభుత్వ పథకాల ద్వారా నగదు ఇప్పిస్తామని మరోచోట ..అమాయకులను నమ్మించి డబ్బు తీసుకుని పరారయ్యాడు. ఇలా 128 మందిని మోసం చేసి నుంచి కోటిరూపాయల మేర నగదు వసూలు చేసిన ఘరానా మోసగాన్ని భవానీపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

author img

By

Published : Apr 30, 2019, 5:57 PM IST

కేడీ నెం1
ఘరానా మోసగాడు

చదివింది డిగ్రీ.. మార్కెటింగ్ ఉద్యోగం చేశాడు. ఎంతటివారినైనా క్షణాల్లో బుట్టలో వేస్తాడు. ఈ చలాకీతనాన్ని దుర్వినియోగం చేస్తూ.. అమాయకుల నుంచి డబ్బు దోచుకోవటాన్ని ప్రారంభించాడు... విజయవాడ భవానీపురానికి చెందిన రామ్ గోపాల్. చివరికి మోసాలనే తన ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలో స్థానిక మసీదు సెంటర్​లోని ఓ అంతర్జాల కేంద్రానికి ప్రతిరోజూ వెళ్తూ... యజమాని సత్య తో తాను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. స్వచ్ఛభారత్ పథకంలో జిల్లాల వారీగా తాత్కాలిక ఉద్యోగులు అవసరమని..ఆ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని సత్యను నమ్మించాడు .అతని ద్వారా మరో 15 మందిని పరిచయం చేసుకుని 52 లక్షల రూపాయలను వసూలు చేసి పరారయ్యాడు . బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో రామ్ గోపాల్ పాపాల చిట్టా బయటపడింది. ఈ మోసగాడు ఇప్పటివరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. విలాసవంతమైన జీవితం, విమానాల్లో విహారయాత్రల కోసం అడ్డదార్లు తొక్కాడని దర్యాప్తులో గుర్తించారు.

ఒకప్పుడు మోసపోయాడు... ఇప్పుడు మోసం చేస్తున్నాడు

రామ్ గోపాల్ విశాఖ ,రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ,హైదరాబాద్ ,ప్రకాశం జిల్లాల్లో మొత్తం 128 మంది బాధితుల నుంచి కోటి రూపాయల మేర నగదు వసూలు చేశాడని పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను... తక్కువ వడ్డీకి రుణాలప్పిస్తానని రైతులను మోసం చేసి పరారయ్యాడు. ఇలా ప్రతీచోట ఒక్కొక్క పేరుతో ఒక్కో అవతారమెత్తే ఈ కిలాడీ... మొదట మరో వ్యక్తి చేతిలో మోసపోయాడు. ఆ క్షణం నుంచీ నేరస్తుడిగా మారాడు. మార్కెటింగ్ ,ఫైనాన్స్ రంగంలో ఉద్యోగాలు చేసి వాటిలో లొసుగులను గుర్తించాడు. డబ్బు ఎరవేసి ఎదుటి వ్యక్తి ఎలా దోచుకోవాలో నేర్చుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి నుంచి 16 లక్షల విలువ చేసే నగదు, నగలు, నకిలీ స్టాంపులు, ధ్రువపత్రాలు ,ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాల కోసం డబ్బులిచ్చి మోసపోద్దని పోలీసులు సూటించారు.

ఘరానా మోసగాడు

చదివింది డిగ్రీ.. మార్కెటింగ్ ఉద్యోగం చేశాడు. ఎంతటివారినైనా క్షణాల్లో బుట్టలో వేస్తాడు. ఈ చలాకీతనాన్ని దుర్వినియోగం చేస్తూ.. అమాయకుల నుంచి డబ్బు దోచుకోవటాన్ని ప్రారంభించాడు... విజయవాడ భవానీపురానికి చెందిన రామ్ గోపాల్. చివరికి మోసాలనే తన ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలో స్థానిక మసీదు సెంటర్​లోని ఓ అంతర్జాల కేంద్రానికి ప్రతిరోజూ వెళ్తూ... యజమాని సత్య తో తాను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. స్వచ్ఛభారత్ పథకంలో జిల్లాల వారీగా తాత్కాలిక ఉద్యోగులు అవసరమని..ఆ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని సత్యను నమ్మించాడు .అతని ద్వారా మరో 15 మందిని పరిచయం చేసుకుని 52 లక్షల రూపాయలను వసూలు చేసి పరారయ్యాడు . బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో రామ్ గోపాల్ పాపాల చిట్టా బయటపడింది. ఈ మోసగాడు ఇప్పటివరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. విలాసవంతమైన జీవితం, విమానాల్లో విహారయాత్రల కోసం అడ్డదార్లు తొక్కాడని దర్యాప్తులో గుర్తించారు.

ఒకప్పుడు మోసపోయాడు... ఇప్పుడు మోసం చేస్తున్నాడు

రామ్ గోపాల్ విశాఖ ,రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ,హైదరాబాద్ ,ప్రకాశం జిల్లాల్లో మొత్తం 128 మంది బాధితుల నుంచి కోటి రూపాయల మేర నగదు వసూలు చేశాడని పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను... తక్కువ వడ్డీకి రుణాలప్పిస్తానని రైతులను మోసం చేసి పరారయ్యాడు. ఇలా ప్రతీచోట ఒక్కొక్క పేరుతో ఒక్కో అవతారమెత్తే ఈ కిలాడీ... మొదట మరో వ్యక్తి చేతిలో మోసపోయాడు. ఆ క్షణం నుంచీ నేరస్తుడిగా మారాడు. మార్కెటింగ్ ,ఫైనాన్స్ రంగంలో ఉద్యోగాలు చేసి వాటిలో లొసుగులను గుర్తించాడు. డబ్బు ఎరవేసి ఎదుటి వ్యక్తి ఎలా దోచుకోవాలో నేర్చుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి నుంచి 16 లక్షల విలువ చేసే నగదు, నగలు, నకిలీ స్టాంపులు, ధ్రువపత్రాలు ,ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాల కోసం డబ్బులిచ్చి మోసపోద్దని పోలీసులు సూటించారు.

spot. date: 30_04_2019 file name: ap_knl_51_30_accidents_3_died_av_c5 contributor name_ s.sudhakar, dhone. యాంకర్ పార్ట్ : కర్నూలు జిల్లా డోన్ జాతీయరహదారి పైన వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ముగ్గురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కర్నూల్ జిల్లా డోన్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద బైక్ ను బోలెరో వాహనం బైక్ వెళుతున్న శీను అక్కడికి అక్కడే మృతి చెందాడు ఇతను వెల్దుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ తనిఖీ కేంద్రంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. రెండవ ఘటన :: వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో కేసవయ్యఆచారి కర్నూలులో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంకో బైక్ పై వెళుతున్న వ్యక్తి ఓబులేసు కు తీవ్ర గాయాలయ్యాయి. మూడవ ఘటన :: డోన్ జాతీయ రహదారి పై ఉడుములపాడు సమీపంలో బైక్ పై వెళుతున్న అలా నగరాజును వెనకనుండి ఆటో ఢీ కొన్న ఘటనలో అలా నాగరాజు కర్నూలులో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.