చెరువులో పడి గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం కృష్ణాజిల్లా నూజివీడు చెరువులో గల్లంతైన ఈవోపీఆర్డీ సాదం పేరారావు (55) మృతదేహమై తేలారు. జిల్లాలోని బత్తుల వారి గూడెం గ్రామాంలో నివసిసిస్తున్న ముసునూరు మండల పరిషత్ ఈవోపీఆర్డీ సాదం పేరా రావు పశువులను మళ్లించేందుకు వెళ్లి తిరిగి రాకపోవటంతో ఆచూకీ లభించలేదని పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా..స్పదించిన సిబ్బంది గ్రామంలోని జల సుందరం చెరువులో అగ్నిమాపక, రెవెన్యూ, పోలీసు శాఖలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాగా రావు మృతదేహం లభించింది. ఈ దుర్ఘటనకు సంబంధించి నూజివీడు రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:
నరసరావుపేటలో వ్యక్తి అనుమానాస్పద మృతి.