ETV Bharat / state

'త్వరలోనే రాయలసీమ దాహార్తిని తీర్చేలా ప్రణాళికలు'

సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణలు నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేసి రాయలసీమ దాహార్తిని తీర్చేలా ప్రణాళిక చేసినట్టు వెల్లడించారు.

author img

By

Published : Sep 25, 2020, 8:35 AM IST

ministers review meeting
మంత్రుల సమీక్ష

అనంతపురం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణలు సమీక్షించారు. విజయవాడలోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలోని రైతు సాధికార సంస్థ సమావేశ మందిరంలో నీటిపారుదల అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలోని 63 మండలాల్లో 70 శాతం అధికంగా వర్షపాతం కురిసిందని.. సాగు, తాగు నీరు పుష్కలంగా ఉందని మంత్రులు పేర్కొన్నారు. అవసరాల కోసం ఈ నీటిని పొదుపుగా వాడుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలోని మడకశిర తదితర ప్రాంతాలకు బుక్కపట్నం చెరువు నుంచి తాగునీటి సరఫరాకు ప్రభుత్వం ప్రాజెక్టు చేపట్టిందని తెలిపారు.

అనంతపురం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణలు సమీక్షించారు. విజయవాడలోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలోని రైతు సాధికార సంస్థ సమావేశ మందిరంలో నీటిపారుదల అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలోని 63 మండలాల్లో 70 శాతం అధికంగా వర్షపాతం కురిసిందని.. సాగు, తాగు నీరు పుష్కలంగా ఉందని మంత్రులు పేర్కొన్నారు. అవసరాల కోసం ఈ నీటిని పొదుపుగా వాడుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలోని మడకశిర తదితర ప్రాంతాలకు బుక్కపట్నం చెరువు నుంచి తాగునీటి సరఫరాకు ప్రభుత్వం ప్రాజెక్టు చేపట్టిందని తెలిపారు.

ఇవీ చూడండి..

క్వారంటైన్ కేంద్రంలో కరోనా బాధితుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.