ఆంధ్రప్రదేశ్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ పనుల పురోగతిపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆరా తీశారు. లాజిస్టిక్ హబ్కు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. కాకినాడలో నిర్మిస్తున్న లాజిస్టిక్ హబ్ ఈ ఆర్థిక సంవత్సర చివరికల్లా పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో మచిలీపట్నం కేంద్రంగా వెయ్యి ఎకరాల్లో నిర్మించే ప్రతిపాదన ఉన్న ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ అండ్ మానుఫాక్ఛరింగ్ జోన్ ప్రాజెక్టుపైనా మంత్రి అధికారులతో చర్చించారు.
ఇదీ చదవండి... 112 వసంతాలు పూర్తి చేసుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా