పట్టణ ప్రాంతాల్లో రేషన్ కార్డులేని మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం జగనన్న స్మార్ట్టౌన్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు గుడివాడలో మంత్రి నాని తెలిపారు. స్మార్ట్ టౌన్ పథక తొలివిడతలో గుడివాడ, మచిలీపట్నంలు ఎంపిక అయ్యాయన్నారు. అర్హులైన మధ్యతరగతి వర్గాలు ఈనెల 10వ తేదీలోపు వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాసరావు, పట్టణ వైకాపా అధ్యక్షుడు గొర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తెలుగు బిడ్డకు సర్వోన్నత గౌరవం