ETV Bharat / state

సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయంలో మోసం..నకిలీ చలాన్లతో రూ.75 లక్షలు మాయం

మండవల్లి సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయంలో భారీ మోసం బయటపడింది. నకిలీ చలానాలతో రూ. 75 లక్షల మేర మోసం జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

author img

By

Published : Aug 10, 2021, 9:28 PM IST

సబ్​రిజిస్టర్ కార్యాలయం
సబ్​రిజిస్టర్ కార్యాలయం

కృష్ణా జిల్లా మండవల్లి సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయంలో భారీ మోసం బయటపడింది. నకిలీ చలానాలతో రూ. 75 లక్షల మేర మోసం జరిగినట్లు సమాచారం. నకిలీ చలానాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ పద్ధతిని తీసుకువచ్చింది. ఈ క్రమంలో సంబంధిత రికార్డులను జిల్లా అధికారులు తనిఖీ చేస్తుండగా మోసం బయటపడింది. అధికారులు ప్రమేయంతోనే ఈ మోసం జరిగినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది.

దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందించామని సబ్​ రిజిస్ట్రార్​ సుబ్రహ్మణ్యం తెలిపారు.

కృష్ణా జిల్లా మండవల్లి సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయంలో భారీ మోసం బయటపడింది. నకిలీ చలానాలతో రూ. 75 లక్షల మేర మోసం జరిగినట్లు సమాచారం. నకిలీ చలానాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ పద్ధతిని తీసుకువచ్చింది. ఈ క్రమంలో సంబంధిత రికార్డులను జిల్లా అధికారులు తనిఖీ చేస్తుండగా మోసం బయటపడింది. అధికారులు ప్రమేయంతోనే ఈ మోసం జరిగినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది.

దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందించామని సబ్​ రిజిస్ట్రార్​ సుబ్రహ్మణ్యం తెలిపారు.

ఇదీ చదవండి: murder: ప్రేమ పేరుతో నమ్మించి.. నగలు దోచి.. యమునా నదిలో తోసేశారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.