కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామానికి చెందిన అప్పారావు... విజయవాడ సత్తుపల్లి రోడ్డులో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా చాట్రాయి మండలం చనుబండ వద్ద కొండముచ్చు ఒక్కసారిగా దాడి చేసింది.
ఈ హఠాత్పరిణామంతో అప్పారావు అదుపుతప్పి బైక్ పై నుంచి కింద పడ్డాడు. ఈ ఘటనలో అప్పారావుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
ఇవీ చదవండి:
'మగువా మగువా' ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది
జుత్తాడలో తీవ్ర ఉద్రిక్తత.. హోంమంత్రి, కలెక్టర్ రావాలంటున్న మృతుల బంధువులు