కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లిలో లక్ష్మణ్(29) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా సోకిందన్న భయంతో నీటి సంపులోకి దూకి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కొవిడ్ భయంతో మృతదేహం వెలికితీసేందుకు కూడా స్థానికులు ముందుకురాలేదు. ఆత్కూరు పోలీసులు, అధికారులు శవాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 10 లక్షల మార్కును దాటేసిన కరోనా కేసులు