ETV Bharat / state

అమరావతి గ్రాఫిక్స్​పై క్లారిటీ ఇస్తున్నా: లోకేశ్

author img

By

Published : Dec 26, 2019, 10:58 PM IST

Updated : Dec 27, 2019, 1:07 AM IST

వైకాపా నేతల వైఖరిపై నారా లోకేశ్ ట్విటర్​లో మండిపడ్డారు. అమరావతి కోసం ధర్నా చేస్తున్న రైతులను పెయిడ్​ ఆర్టిస్టులనడం తగదని హితవు పలికారు. అమరావతి గ్రాఫిక్స్ అంటున్న 'వైకాపా గ్రాఫిక్స్ నాయకుల' కోసం అమరావతి స్వరూపాన్ని చూపిస్తున్నా అంటూ వీడియోను పోస్ట్ చేశారు.

lokesh tweet on capital city
రాజధాని అమరావతిపై లోకేష్ ట్వీట్

ఎన్ని చేసినా కుక్క తోక వంకరే అన్నట్టు వైకాపా నేతల వైఖరి ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. మీడియా సమావేశంలో గుంటూరు, కృష్ణా జిల్లాల వైకాపా నాయకుల మొహాలు చూస్తేనే అమరావతి నిజమా, గ్రాఫిక్సా అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. నిరసనలు చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవమానపరిచారని మండిపడ్డారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిన వైకాపా నాయకులు.. దాన్ని నిరూపించలేక చేతులెత్తేశారని దుయ్యబట్టారు. శాసనసభ సాక్షిగా అమరావతికి జైకొట్టిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు.

రాజధాని అమరావతిపై లోకేష్ ట్వీట్
ఇదీ చదవండి:

ఏపీ రాజధాని ఏదో రేపు చెబుతాం: మంత్రి బొత్స

ఎన్ని చేసినా కుక్క తోక వంకరే అన్నట్టు వైకాపా నేతల వైఖరి ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. మీడియా సమావేశంలో గుంటూరు, కృష్ణా జిల్లాల వైకాపా నాయకుల మొహాలు చూస్తేనే అమరావతి నిజమా, గ్రాఫిక్సా అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. నిరసనలు చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవమానపరిచారని మండిపడ్డారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిన వైకాపా నాయకులు.. దాన్ని నిరూపించలేక చేతులెత్తేశారని దుయ్యబట్టారు. శాసనసభ సాక్షిగా అమరావతికి జైకొట్టిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు.

రాజధాని అమరావతిపై లోకేష్ ట్వీట్
ఇదీ చదవండి:

ఏపీ రాజధాని ఏదో రేపు చెబుతాం: మంత్రి బొత్స

sample description
Last Updated : Dec 27, 2019, 1:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.