ETV Bharat / state

'రాష్ట్రాన్ని రివర్స్ గేరులో... వెనక్కి పరుగెత్తిస్తున్నారు' - ఆర్టీసీ చార్జీల పెంపుపై కన్నా లక్ష్మీ నారాయణ స్పందన

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

Laxmi Narayana responded to the Twitter platform on the rise of RTC charges
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీఎంకు లేఖ
author img

By

Published : Dec 8, 2019, 6:24 PM IST

రాష్ట్రాన్ని రివర్స్ గేరులో ...సీఎం వెనక్కి పరిగెత్తిస్తున్నారు.

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మాట తప్పను, మడమ తిప్పను... అని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన జగన్... సీఎం అయ్యాక ఛార్జీలు పెంచి రెండో యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని రివర్స్ గేరులో జెట్ స్పీడులో సీఎం వెనక్కి పరుగెత్తిస్తున్నారని ట్వీట్ చేశారు. ఛార్జీల పెంపును, ప్రజలపై భారాన్ని పెంచడాన్ని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు.

వైఎస్ వివేకా హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. వివేకా హత్యకేసులో నిందితులను ఇంతవరకు పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు సీరియస్​గా వ్యవహరించనట్టు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.

ఇదీచూడండి.ఆర్టీసీ ప్రయాణికుల నెత్తిన ఛార్జీల పిడుగు !

రాష్ట్రాన్ని రివర్స్ గేరులో ...సీఎం వెనక్కి పరిగెత్తిస్తున్నారు.

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మాట తప్పను, మడమ తిప్పను... అని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన జగన్... సీఎం అయ్యాక ఛార్జీలు పెంచి రెండో యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని రివర్స్ గేరులో జెట్ స్పీడులో సీఎం వెనక్కి పరుగెత్తిస్తున్నారని ట్వీట్ చేశారు. ఛార్జీల పెంపును, ప్రజలపై భారాన్ని పెంచడాన్ని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు.

వైఎస్ వివేకా హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. వివేకా హత్యకేసులో నిందితులను ఇంతవరకు పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు సీరియస్​గా వ్యవహరించనట్టు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.

ఇదీచూడండి.ఆర్టీసీ ప్రయాణికుల నెత్తిన ఛార్జీల పిడుగు !

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.