ETV Bharat / state

నవ్యాంధ్రలో జల శక్తి అభియాన్​కు శ్రీకారం

స్వచ్ఛభారత్ నినాదంతో దేశాన్ని పరిశుభ్రత వైపు నడిపించిన మోడీ సర్కారు... ఇప్పుడు ప్రాణాధార సంరక్షణ కోసం నడుం బిగించింది. స్వచ్ఛత విషయంలో దేశ ప్రజల్ని మేల్కొల్పి నట్లే... నీటి సంరక్షణ విషయంలో ప్రతి ఒక్కరిని తట్టిలేపేందుకు జల శక్తి అభియాన్​కు శ్రీకారం చుట్టింది.

author img

By

Published : Jul 30, 2019, 11:48 PM IST

జలసంరక్షణలో నవ్యాంధ్రకు పెద్దపీఠ
జలసంరక్షణలో నవ్యాంధ్రకు పెద్దపీఠ

జల ఉద్యమంలో భాగంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా ప్రత్యేక కార్యశాల నిర్వహించింది. జలవనరుల శాఖకు సంబంధించిన అధికారులు, జల సంరక్షణ కోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భూగర్భజలాలను పెంపొందించేందుకు జలశక్తే... జనశక్తి.... జనశక్తే... జలశక్తి నినాదంతో ముందుకు వెళ్తున్నామని కేంద్ర మంత్రి రతన్​ లాల్ అన్నారు. ఈ దిశగా కేంద్రం అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.

రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రాష్ట్ర జలవనరుల మంత్రి అనిల్ చెప్పారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్​ను ఎంపిక చేయడం శుభసూచకమన్నారు. తక్కువ నీటితో ఎక్కువ సాగు చేస్తున్న పలువురు రైతులు.. తమ అనుభవాలను కార్యశాల వేదికగా పంచుకున్నారు. నీటి నిర్వహణ విధానాలను తెలియజేస్తూ ముద్రించిన గోడ పత్రాలు, కరపత్రాలు, ప్రచార పత్రాలను కేంద్ర మంత్రి రతన్ లాల్, రాష్ట్ర మంత్రి అనిల్.. కార్యశాలలో విడుదల చేశారు.

ఇదీ చూడండి... ప్రధానోపాధ్యయుడిని శిక్షించాలి

జలసంరక్షణలో నవ్యాంధ్రకు పెద్దపీఠ

జల ఉద్యమంలో భాగంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా ప్రత్యేక కార్యశాల నిర్వహించింది. జలవనరుల శాఖకు సంబంధించిన అధికారులు, జల సంరక్షణ కోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భూగర్భజలాలను పెంపొందించేందుకు జలశక్తే... జనశక్తి.... జనశక్తే... జలశక్తి నినాదంతో ముందుకు వెళ్తున్నామని కేంద్ర మంత్రి రతన్​ లాల్ అన్నారు. ఈ దిశగా కేంద్రం అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.

రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రాష్ట్ర జలవనరుల మంత్రి అనిల్ చెప్పారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్​ను ఎంపిక చేయడం శుభసూచకమన్నారు. తక్కువ నీటితో ఎక్కువ సాగు చేస్తున్న పలువురు రైతులు.. తమ అనుభవాలను కార్యశాల వేదికగా పంచుకున్నారు. నీటి నిర్వహణ విధానాలను తెలియజేస్తూ ముద్రించిన గోడ పత్రాలు, కరపత్రాలు, ప్రచార పత్రాలను కేంద్ర మంత్రి రతన్ లాల్, రాష్ట్ర మంత్రి అనిల్.. కార్యశాలలో విడుదల చేశారు.

ఇదీ చూడండి... ప్రధానోపాధ్యయుడిని శిక్షించాలి

Intro:Ap_cdp_46_30_Railway previteekarana pai_nirasana_Av_Ap10043
k.veerachari, 9948047582
రైల్వే శాఖ విషయంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని సిఐటియు జిల్లా కార్యదర్శి సి.రవికుమార్ ఆరోపించారు. రైల్వేలో ప్రైవేటీకరణను ఆపాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కడప జిల్లా రాజంపేట రైల్వే స్టేషన్లో మంగళవారం ఆందోళనకు దిగారు. రైల్వే స్టేషన్ మాస్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే స్టేషను ప్రైవేటు పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. ఇప్పటికే పలు విభాగాలను ప్రైవేటీకరణ చేశారని ధ్వజమెత్తారు. ఇలాగే కొనసాగితే కార్మికులకు భద్రత ఉండదన్నారు ఇప్పటికైనా నా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను మానుకోవాలని, లేదంటే ఎంతటి ఉద్యమానికైనా వెనకాడబోమని హెచ్చరించారు. రైల్వే మజ్దూర్ యూనియన్ నందలూరు శాఖ చైర్మన్ గోపీనాథ్ మాట్లాడుతూ రైల్వేలో ప్రైవేటీకరణ విధానాన్ని తొలి నుంచి తాము వ్యతిరేకిస్తున్నామని, ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. మా ఉద్యమాలకు సిఐటియు వంటి సంఘాలు సంఘీభావం తెలుపుతూ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.


Body:రైల్వేలో ప్రైవేటీకరణను ఆపాలంటూ నిరసన


Conclusion:సిఐటియు జిల్లా కార్యదర్శి రవికుమార్
రైల్వే మజ్దూర్ యూనియన్ నందలూరు శాఖ చైర్మన్ గోపీనాథ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.