ETV Bharat / state

గుడివాడలో... పంతం నీదా నాదా..! - elections-2019

గుడివాడ... తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్​ సొంత నియోజకవర్గంగా తెలుగు ప్రజలకు సుపరిచితం. అభ్యర్థి ఎవరైనా... తెదేపాదే విజయం. 2సార్లు తప్ప. ఈసారీ పోరు హోరాహోరీ కానుంది. ఒకరేమో హ్యాట్రిక్ సాధించి నాలుగోసారి బరిలో ఉంటే... మరొకరేమో తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

నానితో తలపడుతున్న అవినాష్
author img

By

Published : Mar 23, 2019, 5:35 PM IST

నానితో తలపడుతున్న అవినాష్
కృష్ణా జిల్లా గుడివాడలో గెలుపు 2 ప్రధాన పార్టీలకు సవాల్​గా మారింది. వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం వ్యూహ ప్రతివ్యూహాలతో చేస్తున్న పోరు రసవత్తరమైంది. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వారసుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్​ తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో ఉన్నారు. వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని పోటీ చేస్తున్నారు. ఎంతమంది పోటీలో ఉన్నా ఈ ఇద్దరి మధ్యే వార్. పదునైన ప్రసంగాలకు ఇద్దరూ ఇద్దరే.

నాలుగోసారీ గెలుస్తా...!

నాలుగోసారి గెలిచి గుడివాడ సీటు అధినేత జగన్​కు కానుక అందిస్తానంటున్నారు కొడాలి నాని. 2004, 2009లో తెదేపా తరఫున విజయం సాధించారు. అనంతరం వైకాపాలో చేరి 2014లో హ్యాట్రిక్ అందుకున్నారు. వరుసగా మూడుసార్లు గెలిచి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నానని, వారి అభిమానమే గెలిపిస్తుందన్న ధీమాతో ఉన్నారాయన. నియోజకవర్గంలో కొన్ని వర్గాల అండ, యువతలో ఫాలోయింగ్, ఎన్నికల వ్యూహాల్లో అనుభవం, అధికారంలోకి వస్తే నెరవేరుస్తామంటున్న 'నవరత్నాల' హామీలు.. తమకు కలిసొస్తాయని ఆ పార్టీ అంచనా. గుడివాడ, నందివాడ మండలాల్లో నానికి మంచి పట్టుంది. హైదరాబాద్​లో నివాసం ఉంటూ... నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం ప్రతికూలంగా మారే అవకాశం.

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా

ఒక్కసారి అవకాశమిస్తే అభివృద్ధితో నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని దేవినేని అవినాష్ ఇస్తున్న హామీకి.. ప్రజలు ఆకర్షితులవుతారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అవినాష్​ను పోటీలో దింపడం ప్రయోగంగానే భావిస్తున్నాయి తెదేపా వర్గాలు. బెజవాడ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకన్న దేవినేని వారసుడిగా... తెదేపా కంచుకోటలో జెండా ఎగరవేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పది పర్యాయాలుగా జరిగిన ఎన్నికల్లో 8 సార్లు తెలుగుదేశమే గెలిచింది. పటిష్ఠమైన పార్టీ యంత్రాంగం, సీనియర్ నేతల అండ, ప్రభుత్వ సంక్షేం, అభివృద్ధి పథకాలు అనినాష్​కు కలిసిరానున్నాయి. గుడివాడ పురపాలక సంఘం ఛైర్మన్​తోపాటు 12 మంది కౌన్సిలర్లు తెదేపాలో చేరడం అదనపు బలం కానుంది. స్థానికేతరుడనే ప్రచారం, ఎన్నికల బరిలో తొలిసారి కావడం బలహీనతలుగా చెప్పుకుంటున్నారు విశ్లేషకులు.

ఇవీ చూడండి:ఒంగోలు ఎవరిని వరించునో..?

నానితో తలపడుతున్న అవినాష్
కృష్ణా జిల్లా గుడివాడలో గెలుపు 2 ప్రధాన పార్టీలకు సవాల్​గా మారింది. వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం వ్యూహ ప్రతివ్యూహాలతో చేస్తున్న పోరు రసవత్తరమైంది. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వారసుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్​ తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో ఉన్నారు. వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని పోటీ చేస్తున్నారు. ఎంతమంది పోటీలో ఉన్నా ఈ ఇద్దరి మధ్యే వార్. పదునైన ప్రసంగాలకు ఇద్దరూ ఇద్దరే.

నాలుగోసారీ గెలుస్తా...!

నాలుగోసారి గెలిచి గుడివాడ సీటు అధినేత జగన్​కు కానుక అందిస్తానంటున్నారు కొడాలి నాని. 2004, 2009లో తెదేపా తరఫున విజయం సాధించారు. అనంతరం వైకాపాలో చేరి 2014లో హ్యాట్రిక్ అందుకున్నారు. వరుసగా మూడుసార్లు గెలిచి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నానని, వారి అభిమానమే గెలిపిస్తుందన్న ధీమాతో ఉన్నారాయన. నియోజకవర్గంలో కొన్ని వర్గాల అండ, యువతలో ఫాలోయింగ్, ఎన్నికల వ్యూహాల్లో అనుభవం, అధికారంలోకి వస్తే నెరవేరుస్తామంటున్న 'నవరత్నాల' హామీలు.. తమకు కలిసొస్తాయని ఆ పార్టీ అంచనా. గుడివాడ, నందివాడ మండలాల్లో నానికి మంచి పట్టుంది. హైదరాబాద్​లో నివాసం ఉంటూ... నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం ప్రతికూలంగా మారే అవకాశం.

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా

ఒక్కసారి అవకాశమిస్తే అభివృద్ధితో నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని దేవినేని అవినాష్ ఇస్తున్న హామీకి.. ప్రజలు ఆకర్షితులవుతారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అవినాష్​ను పోటీలో దింపడం ప్రయోగంగానే భావిస్తున్నాయి తెదేపా వర్గాలు. బెజవాడ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకన్న దేవినేని వారసుడిగా... తెదేపా కంచుకోటలో జెండా ఎగరవేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పది పర్యాయాలుగా జరిగిన ఎన్నికల్లో 8 సార్లు తెలుగుదేశమే గెలిచింది. పటిష్ఠమైన పార్టీ యంత్రాంగం, సీనియర్ నేతల అండ, ప్రభుత్వ సంక్షేం, అభివృద్ధి పథకాలు అనినాష్​కు కలిసిరానున్నాయి. గుడివాడ పురపాలక సంఘం ఛైర్మన్​తోపాటు 12 మంది కౌన్సిలర్లు తెదేపాలో చేరడం అదనపు బలం కానుంది. స్థానికేతరుడనే ప్రచారం, ఎన్నికల బరిలో తొలిసారి కావడం బలహీనతలుగా చెప్పుకుంటున్నారు విశ్లేషకులు.

ఇవీ చూడండి:ఒంగోలు ఎవరిని వరించునో..?

Intro:ap_rjy_36_23_party_candits_namenations_av_c5 తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్


Body:ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు


Conclusion:తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మడివరం అసెంబ్లీ స్థానానికి ప్రధాన పార్టీలైన తెలుగు దేశం నుండి దాట్ల బుచ్చి బాబు వైఎస్ఆర్సీపీ నుండి వెంకట సతీష్ జనసేన నుండి పితాని బాలకృష్ణ అతని సతీమణి సరస్వతి భారతీయ జనతా పార్టీ నుండి కర్రీ చిట్టిబాబు కాంగ్రెస్ పార్టీ నుండి mopuri శ్రీనివాస్ కిరణ్ మరియు. గంగిరెడ్డి త్రినాధ రావు లు నామ్ పత్రాలను రిటర్నింగ్ అధికారి శేషి రెడ్డి కి సమర్పించారు దీంతో ప్రధాన పార్టీల పెద్దలు అందరూ ప్రచారంపై దృష్టి పెట్టారు నామినేషన్లు సమర్పణకు ఈనెల 25వ తారీకు ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉన్నందున ఆశావహులు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.