2020-21 విద్యా సంవత్సరం వైద్య విద్యా ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది .ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు వేర్వేరుగా కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టాలని జీవోలో పేర్కొన్నారు. అభ్యర్థి కౌన్సెలింగ్లో సీటు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ కళాశాలలో జాయిన్ కావాలని జీవోలో తెలిపారు. అభ్యర్థులు కాలేజీ ఆప్షన్స్ను ఎంచుకునేటప్పుడు వరుసలో అన్ని కాలేజీలు ఎంపిక చేసుకోవచ్చన్నారు. కరోనా వ్యాప్తి జరుగుతున్న కారణంగా ఆన్ లైన్ లోనే కౌన్సెలింగ్ ప్రక్రియ జరుతుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉన్నతాధికారులు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం హైపవర్ కమిటీ ఏర్పాటు చేశామని ..కమిటీలో ఇద్దరు ఐఏఎస్లతో పాటు విద్యావేత్తలు ఉన్నారని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే ప్రవేశ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు వర్శిటీ అధికారులు తెలిపారు. ఇప్పటికే అభ్యర్థుల మెరిట్ జాబితాను వెబ్ సైట్లో పొందుపరిచారు. 250 పైగా అభ్యంతరాలు వచ్చినట్లు వర్శిటీ అధికారులు చెపుతున్నారు. వీటన్నింటిని పరిశీలించి తుది మెరిట్ జాబితాను పొందుపరుస్తామని అధికారులు తెలిపారు. అనంతరం అభ్యర్థులు ఆన్ లైన్లో ఆప్షన్లు పెట్టుకోవచ్చని తెలిపారు. ఇవాళ తుది మెరిట్ జాబితాను ఉంచే అవకాశాలున్నాయి. సోమవారం నుంచి విద్యార్ధులకు అప్షన్లు పెట్టుకునే అవకాశాన్ని కల్పించనున్నారు
ఇవీ చదవండి