ETV Bharat / state

గణపయ్యరాకతో...మురిసిన భక్తజన సందోహం

author img

By

Published : Sep 2, 2019, 11:45 PM IST

కృష్ణాజిల్లాలోని ప్రముఖ దేవస్థానాల్లో వినాయకచవితి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. విజయవాడ దుర్గ గుడి, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

గణపయ్యరాకతో...మురిసిన భక్తజన సందోహం
కృష్ణా జిల్లాలో గణనాథుడి తొలిపూజ
వినాయక చవితి సందర్భంగా కృష్ణా జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో తొలి పూజ ఘనంగా నిర్వహించారు. విజయవాడ దుర్గ గుడిలో మట్టి ప్రతిమకు ఈవో దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ రకాల పూలు, పండ్లు, పత్రాలతో మట్టి గణనాథుడిని ప్రార్థించారు. తాడేపల్లిలోని శ్రీ పంచముఖ వీరాంజనేయ సన్నిధిలో వినాయక వ్రతం చేపట్టారు. మూలమంత్ర, నవగ్రహ హోమాలు చేశారు. విజయవాడలోని బీసెంట్​రోడ్డు, గాంధీనగర్​, లెనిన్​, సత్యనారాయణపురం కూడళ్లలో భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. కోర్కెలు తీర్చే గణనాథుడు తమ వద్దకు వచ్చాడని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి...గుంటూరులో 35 అడుగుల భారీ మట్టి వినాయకుడు

కృష్ణా జిల్లాలో గణనాథుడి తొలిపూజ
వినాయక చవితి సందర్భంగా కృష్ణా జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో తొలి పూజ ఘనంగా నిర్వహించారు. విజయవాడ దుర్గ గుడిలో మట్టి ప్రతిమకు ఈవో దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ రకాల పూలు, పండ్లు, పత్రాలతో మట్టి గణనాథుడిని ప్రార్థించారు. తాడేపల్లిలోని శ్రీ పంచముఖ వీరాంజనేయ సన్నిధిలో వినాయక వ్రతం చేపట్టారు. మూలమంత్ర, నవగ్రహ హోమాలు చేశారు. విజయవాడలోని బీసెంట్​రోడ్డు, గాంధీనగర్​, లెనిన్​, సత్యనారాయణపురం కూడళ్లలో భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. కోర్కెలు తీర్చే గణనాథుడు తమ వద్దకు వచ్చాడని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి...గుంటూరులో 35 అడుగుల భారీ మట్టి వినాయకుడు

Intro:FILENAME: AP_ONG_32_02_VIDHI_VIDHI_NA_GHANANADHUDU_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

వినాయక చవితి పండుగ అనగానే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఉల్లాసంగా చవితి పండుగ వేడుకలు జరుపుకుంటారు. దానిలో భాగంగా యర్రగొండపాలెం పట్టణం ఏ విధి చూసిన వినాయక సందడి నెలకొంది. చలవ పందిళ్లు వేసి అందంగా అలంకరించి గణనాధున్ని ప్రతిష్టించారు. పట్టణం లోని వివిధ అకృతుల ఉన్న లంబోదరుని విగ్రహాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కొలుకుల రోడ్ లో , పుల్లల చెరువు సెంటర్ నందు ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాల ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.


Body:kit nom 749


Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.