ETV Bharat / state

నూజివీడు బ్రాంచ్ కెనాల్​లో నలుగురు గల్లంతు..ఇద్దరిని రక్షించిన స్థానికులు

కూలికి వెళ్లిన నలుగురు కూలీలు నూజివీడు బ్రాంచ్ కెనాల్​లో గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరిని స్థానికులు సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ వద్ద జరిగింది.

author img

By

Published : Apr 11, 2021, 7:37 PM IST

కెనాల్లో ఈతకొడుతూ.. ఇద్దరు కూలీలు గల్లంతు
కెనాల్లో ఈతకొడుతూ.. ఇద్దరు కూలీలు గల్లంతు

కృష్ణాజిల్లా నూజివీడు మండలం మిట్టగూడెం గ్రామానికి చెందిన నలుగురు కూలి కోసం రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలో మామిడి కోతకు వెళ్లారు. తోట సమీపంలోని నూజివీడు బ్రాంచ్ కెనాల్​లో సరదాగా ఈత కొడుతుండగా గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరిని స్థానికులు కాపాడి.. బయటికి తీసుకొచ్చారు. మరో ఇద్దరి కోసం స్థానికులు, తోటి కూలీలు గాలింపు చర్యలు చేపట్టారు. తోట యజమాని అధికారులకు సమాచారం ఇచ్చారు.

కృష్ణాజిల్లా నూజివీడు మండలం మిట్టగూడెం గ్రామానికి చెందిన నలుగురు కూలి కోసం రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలో మామిడి కోతకు వెళ్లారు. తోట సమీపంలోని నూజివీడు బ్రాంచ్ కెనాల్​లో సరదాగా ఈత కొడుతుండగా గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరిని స్థానికులు కాపాడి.. బయటికి తీసుకొచ్చారు. మరో ఇద్దరి కోసం స్థానికులు, తోటి కూలీలు గాలింపు చర్యలు చేపట్టారు. తోట యజమాని అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఇవీ చదవండి

తిరుపతిలో దారుణం.. ఓ లాడ్జిలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.