ETV Bharat / state

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మాజీమంత్రి దేవినేని ఉమా

నివర్ తుపాన్ ధాటికి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు డిమాండ్ చేశారు. మైలవరం మండలంలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు.

author img

By

Published : Dec 2, 2020, 4:48 PM IST

రైతుతో మాట్లాడుతున్న దేవినేని ఉమా
రైతుతో మాట్లాడుతున్న దేవినేని ఉమా

పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా మైలవరం మండలం చండ్రగూడెంలో మాజీ మంత్రి దేవినేని ఉమా పర్యటించారు. తుపాన్ ధాటికి దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

నియోజకవర్గంలో రైతులకు భరోసా ఇవ్వాల్సిన స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అ భద్రతా భావంతో అసెంబ్లీలో సైతం తనపై ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారని ఉమా ఎద్దేవా చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీపై ఇప్పటివరకు స్పష్టత తేలేకపోవడం నియోజకవర్గ ఎమ్మెల్యే వైఫల్యమని అన్నారు. తెదేపా రైతులకు ఎళ్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా మైలవరం మండలం చండ్రగూడెంలో మాజీ మంత్రి దేవినేని ఉమా పర్యటించారు. తుపాన్ ధాటికి దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

నియోజకవర్గంలో రైతులకు భరోసా ఇవ్వాల్సిన స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అ భద్రతా భావంతో అసెంబ్లీలో సైతం తనపై ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారని ఉమా ఎద్దేవా చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీపై ఇప్పటివరకు స్పష్టత తేలేకపోవడం నియోజకవర్గ ఎమ్మెల్యే వైఫల్యమని అన్నారు. తెదేపా రైతులకు ఎళ్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి

ఏపీ - అమూల్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.