ETV Bharat / state

కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన తొలివిడత ఎన్నికలు - కృష్ణా జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు

కృష్ణా జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ దశలో 85.06 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అక్కడక్కడ స్వల్ప వివాదాలు జరిగినా.. పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపు చేశారు.

first phase panchayat elections
కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన తొలివిడత ఎన్నికలు
author img

By

Published : Feb 10, 2021, 12:44 PM IST

కృష్ణా జిల్లాలో చెదురు మదురు సంఘటనలు మినహా తొలివిడత పంచాయతీ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. విజయవాడ డివిజనులోని 14 మండలాల్లో 211 పంచాయతీలకు మంగళవారం ఓటింగ్‌ జరిగింది. ఉదయం 6.30గంటలకే ప్రారంభం కాగా.. అప్పటికే ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా ఓటర్లు వరుస కట్టారు. తొలివిడతలో మొత్తం 85.06 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇతర ప్రాంతాలకు చెందిన వలస ఓట్లు పెద్దగా నమోదు కాలేదని అభ్యర్ధులు అంటున్నారు. లేకపోతే 90 శాతం దాటాల్సి ఉంది.

పట్టణ వాతావరణం ఉన్న పంచాయతీల్లో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదైంది. ఓట్లు వినియోగించుకున్న వారిలో మహిళలే ఎక్కువ. జగ్గయ్యపేట మండలం వేదాద్రి పంచాయతీలో ఏడో వార్డుకు పోటీచేసిన అభ్యర్థి భర్త రాంబాబుపై ప్రత్యర్థి వర్గం దాడి చేసింది. గొడ్డలితో దాడి చేయడంతో వీపు, చేతి భాగంపై గాయాలయ్యాయి. వాగ్వాదంలో ప్రత్యర్థిగా ఉన్న అభ్యర్థిని భర్త గోపాల్, మరి కొంత మంది కలిసి రాంబాబుపై దాడి చేశారు. ఈ సంఘటనను తెదేపా వర్గాలు తీవ్రంగా ఖండించాయి. అక్కడక్కడ స్వల్ప సంఘర్షణలు మినహా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, జేసీ మాధవీలత, సబ్‌కలెక్టర్‌ ధ్యానచంద్ర పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. ఉదయం 6.30గంటల నుంచి మధ్యాహ్నం .

3.30వరకు పోలింగ్‌ నిర్వహించారు.

* పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు అంతగా ఆసక్తి చూపలేదు. విజయవాడ గ్రామీణంలో రామవరప్పాడు, ఎనికేపాడు, నిడమానూరు లాంటి పంచాయతీలు పట్టణంలో కలిసిపోయాయి. ఇక్కడ 76.45 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. రామవరప్పాడులో రెండు వర్గాలు పోటాపోటీగా పోలింగ్‌ కేంద్రాల వద్ద మోహరించాయి. నున్నలోనూ ఉత్కంఠ భరితంగా పోలింగ్‌ జరిగింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి సంఘటనలు జరగలేదు.

* మైలవరం, గుంటుపల్లి, పెనమలూరు, కంచికచర్ల, చందర్లపాడు, పెనుగంచిప్రోలు పంచాయతీలు 10వేల జనాభా దాటిన వాటి జాబితాలో ఉన్నాయి. దీంతో ఇక్కడ పోలింగ్‌ గంటగంటకూ ఆసక్తికరంగా సాగింది. ఆఖరి గంటలో ఇంటింటికి తిరిగి ఓటర్లను తీసుకువచ్చారు.

* పోలింగ్‌ కేంద్రాల వద్ద శానిటైజర్, థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశారు. వైద్య సౌకర్యం ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సిబ్బంది కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకుని ఫేస్‌ షీల్డు, మాస్కులు, చేతిగ్లౌజులు ధరించారు. ఒక సంఘటన మినహా ప్రశాంతంగా జరిగింది.

టీకా వేసుకుని..! జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్‌ ఇంతియాజ్‌ సోమవారం కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారు. మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. కానీ సోమవారం, పోలింగ్‌ రోజు విస్తృతంగా పర్యటించారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌లో ధైర్యం నింపేందుకు మొదటగా తాను వ్యాక్సిన్‌ తీసుకున్నానని వివరించారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరగడం పట్ల హర్షం ప్రకటించారు.

ఇదీ చదవండీ.. తెదేపా గెలుస్తుందంటావా?

కృష్ణా జిల్లాలో చెదురు మదురు సంఘటనలు మినహా తొలివిడత పంచాయతీ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. విజయవాడ డివిజనులోని 14 మండలాల్లో 211 పంచాయతీలకు మంగళవారం ఓటింగ్‌ జరిగింది. ఉదయం 6.30గంటలకే ప్రారంభం కాగా.. అప్పటికే ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా ఓటర్లు వరుస కట్టారు. తొలివిడతలో మొత్తం 85.06 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇతర ప్రాంతాలకు చెందిన వలస ఓట్లు పెద్దగా నమోదు కాలేదని అభ్యర్ధులు అంటున్నారు. లేకపోతే 90 శాతం దాటాల్సి ఉంది.

పట్టణ వాతావరణం ఉన్న పంచాయతీల్లో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదైంది. ఓట్లు వినియోగించుకున్న వారిలో మహిళలే ఎక్కువ. జగ్గయ్యపేట మండలం వేదాద్రి పంచాయతీలో ఏడో వార్డుకు పోటీచేసిన అభ్యర్థి భర్త రాంబాబుపై ప్రత్యర్థి వర్గం దాడి చేసింది. గొడ్డలితో దాడి చేయడంతో వీపు, చేతి భాగంపై గాయాలయ్యాయి. వాగ్వాదంలో ప్రత్యర్థిగా ఉన్న అభ్యర్థిని భర్త గోపాల్, మరి కొంత మంది కలిసి రాంబాబుపై దాడి చేశారు. ఈ సంఘటనను తెదేపా వర్గాలు తీవ్రంగా ఖండించాయి. అక్కడక్కడ స్వల్ప సంఘర్షణలు మినహా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, జేసీ మాధవీలత, సబ్‌కలెక్టర్‌ ధ్యానచంద్ర పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. ఉదయం 6.30గంటల నుంచి మధ్యాహ్నం .

3.30వరకు పోలింగ్‌ నిర్వహించారు.

* పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు అంతగా ఆసక్తి చూపలేదు. విజయవాడ గ్రామీణంలో రామవరప్పాడు, ఎనికేపాడు, నిడమానూరు లాంటి పంచాయతీలు పట్టణంలో కలిసిపోయాయి. ఇక్కడ 76.45 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. రామవరప్పాడులో రెండు వర్గాలు పోటాపోటీగా పోలింగ్‌ కేంద్రాల వద్ద మోహరించాయి. నున్నలోనూ ఉత్కంఠ భరితంగా పోలింగ్‌ జరిగింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి సంఘటనలు జరగలేదు.

* మైలవరం, గుంటుపల్లి, పెనమలూరు, కంచికచర్ల, చందర్లపాడు, పెనుగంచిప్రోలు పంచాయతీలు 10వేల జనాభా దాటిన వాటి జాబితాలో ఉన్నాయి. దీంతో ఇక్కడ పోలింగ్‌ గంటగంటకూ ఆసక్తికరంగా సాగింది. ఆఖరి గంటలో ఇంటింటికి తిరిగి ఓటర్లను తీసుకువచ్చారు.

* పోలింగ్‌ కేంద్రాల వద్ద శానిటైజర్, థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశారు. వైద్య సౌకర్యం ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సిబ్బంది కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకుని ఫేస్‌ షీల్డు, మాస్కులు, చేతిగ్లౌజులు ధరించారు. ఒక సంఘటన మినహా ప్రశాంతంగా జరిగింది.

టీకా వేసుకుని..! జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్‌ ఇంతియాజ్‌ సోమవారం కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారు. మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. కానీ సోమవారం, పోలింగ్‌ రోజు విస్తృతంగా పర్యటించారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌లో ధైర్యం నింపేందుకు మొదటగా తాను వ్యాక్సిన్‌ తీసుకున్నానని వివరించారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరగడం పట్ల హర్షం ప్రకటించారు.

ఇదీ చదవండీ.. తెదేపా గెలుస్తుందంటావా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.