ETV Bharat / state

యూజీ, పీజీ పరీక్షలపై సీఎంతో చర్చించి నిర్ణయం: మంత్రి సురేష్

author img

By

Published : Jun 25, 2020, 6:49 AM IST

యూజీ, పీజీ పరీక్షలపై ముఖ్యమంత్రి జగన్‌తో చర్చించి, పరీక్షల నిర్వహించడం, రద్దు చేయడంపై నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. అందరి నుంచి వచ్చిన అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి వెల్లడించారు.

educational minister adimulapu suresh speaks about on examination helding possibilities in state
యూజీ, పీజీ పరీక్షలపై సీఎంతో చర్చించి నిర్ణయిస్తామన్న మంత్రి సురేష్

అండర్‌ గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ పరీక్షలపై సీఎం జగన్‌తో చర్చించి, పరీక్షల నిర్వహించడం, రద్దు చేయడంపై నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. అందరి నుంచి వచ్చిన అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఉన్నతాధికారులతో మాట్లాడి సూచనలు తీసుకున్నామన్నారు.


ట్రిపుల్ ‌ఐటీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పరీక్షలు
ట్రిపుల్‌ ఐటీ ఇంజినీరింగ్‌ చివరి ఏడాది, ప్రీ యూనివర్సిటీ కోర్సు (పీయూసీ) రెండో ఏడాది విద్యార్థులకు బహుళైచ్చిక ప్రశ్నావళితో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు కులపతి కేసీ రెడ్డి తెలిపారు. మిగతా విద్యార్థులను ప్రస్తుతం పై తరగతులకు పంపిస్తామని, కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు.


దరఖాస్తు గడువు పొడిగింపు
గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాలల ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈనెల 30వరకు పొడిగించినట్లు కార్యదర్శి ప్రసన్న కుమార్‌ తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు.

అండర్‌ గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ పరీక్షలపై సీఎం జగన్‌తో చర్చించి, పరీక్షల నిర్వహించడం, రద్దు చేయడంపై నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. అందరి నుంచి వచ్చిన అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఉన్నతాధికారులతో మాట్లాడి సూచనలు తీసుకున్నామన్నారు.


ట్రిపుల్ ‌ఐటీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పరీక్షలు
ట్రిపుల్‌ ఐటీ ఇంజినీరింగ్‌ చివరి ఏడాది, ప్రీ యూనివర్సిటీ కోర్సు (పీయూసీ) రెండో ఏడాది విద్యార్థులకు బహుళైచ్చిక ప్రశ్నావళితో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు కులపతి కేసీ రెడ్డి తెలిపారు. మిగతా విద్యార్థులను ప్రస్తుతం పై తరగతులకు పంపిస్తామని, కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు.


దరఖాస్తు గడువు పొడిగింపు
గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాలల ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈనెల 30వరకు పొడిగించినట్లు కార్యదర్శి ప్రసన్న కుమార్‌ తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు.

ఇదీ చదవండి:

సిట్​కు విభాగాధిపతి హోదా కల్పిస్తూ .. ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.