ETV Bharat / state

హైదరాబాద్​లో భూ ప్రకంపనలు.. ఆందోళనకు గురైన ప్రజలు

author img

By

Published : Oct 3, 2020, 6:48 AM IST

తెలంగాణ హైదరాబాద్ నగరంలో వరుస భూప్రకంపనలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి. గత రాత్రి బోరబండలోని పలు ప్రాంతాల్లో స్పల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు పరుగులు పెట్టారు. రాత్రి 8.30గంటల ప్రాంతంలో మొదటగా కంపించగా 11.25కి మరోసారి భూమి కంపించింది. భయాందోళనకు గురైన స్థానికుల రోడ్లకే పరిమితంకాగా మరికొంత మంది వేరే ప్రాతాల్లో ఉన్న వారి బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు.

hyderabad earthquake
హైదరాబాద్​లో భూ ప్రకంపనలు

ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ బోరబండలోని ప్రాంతాలు భూప్రకంపనలతో ఆందోళనకరంగా మారాయి. గత రాత్రి 8.35 గంటలకు భూమి 15 సెకన్ల పాటు కంపించడంతో ఒక్కసారిగా ఇళ్లనుంచి ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 1.5గా నమోదు అయినట్లు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త నగేశ్​ తెలిపారు. ప్రజలు ఆందోళనకు గురికావడం వల్ల అక్కడికి చేరుకున్న ఎస్ఆర్​నగర్, జూబ్లీహిల్స్ పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు జీహెచ్​ఎంసీ, డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గంటలపాటు ప్రజలు రోడ్లపై ఉండటంతో వారికి నచ్చజెప్పి ఇళ్లలోకి పంపిచారు.

భారీ శబ్ధంతో ప్రకంపనలు

డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ అక్కడకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రజలు ఎవరూ భయపడవద్దని తెలిపారు. భూకంపంపై సామాజిక మాద్యమాల్లో కొందరు వదంతులు ప్రచారం చేస్తున్నారని... ఇది ఎలాంటి ప్రమాదకరం కాదని ప్రజలకు నచ్చజెప్పారు. స్థానిక దేవాలయాలు, మసీదుల మైకుల్లో ప్రజలకు ఇళ్లలోపలికి వెళ్లాలని సూచించారు. ప్రజలంతా భయం నుంచి తేరుకుని ఇళ్లలోకి వెళ్లగానే సరిగ్గా 11.25గంటల ప్రాంతంలో మరోసారి భారీ శబ్ధంతో ప్రకంపనలు వచ్చాయి.

బయటకు పరుగులు

మళ్లీ ప్రజలంతా బయటకు పరుగులు తీశారు. మరి కొంతమంది తమ బ్యాగులను సర్దుకుని నగరంలోని వారి బంధువుల ఇళ్లకు ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో వెళ్లిపోయారు. బోరబండతో పాటు పరిసర ప్రాంతాలైన బోరబండ వీకర్ సెక్షన్, పెద్దమ్మ నగర్, పి. అంజయ్యనగర్, వినాయకనగర్, బంజారానగర్, రెహమత్​నగర్​లోని కొన్ని ప్రాంతాలు, అల్లాపూర్ డివిజన్​లోని గాయత్రినగర్, పర్వత్​నగర్, తులసినగర్ ప్రాంతాల్లో భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: రక్తం కొరత.. తలసేమియా బాధితులకు తప్పని అవస్థ

ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ బోరబండలోని ప్రాంతాలు భూప్రకంపనలతో ఆందోళనకరంగా మారాయి. గత రాత్రి 8.35 గంటలకు భూమి 15 సెకన్ల పాటు కంపించడంతో ఒక్కసారిగా ఇళ్లనుంచి ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 1.5గా నమోదు అయినట్లు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త నగేశ్​ తెలిపారు. ప్రజలు ఆందోళనకు గురికావడం వల్ల అక్కడికి చేరుకున్న ఎస్ఆర్​నగర్, జూబ్లీహిల్స్ పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు జీహెచ్​ఎంసీ, డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గంటలపాటు ప్రజలు రోడ్లపై ఉండటంతో వారికి నచ్చజెప్పి ఇళ్లలోకి పంపిచారు.

భారీ శబ్ధంతో ప్రకంపనలు

డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ అక్కడకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రజలు ఎవరూ భయపడవద్దని తెలిపారు. భూకంపంపై సామాజిక మాద్యమాల్లో కొందరు వదంతులు ప్రచారం చేస్తున్నారని... ఇది ఎలాంటి ప్రమాదకరం కాదని ప్రజలకు నచ్చజెప్పారు. స్థానిక దేవాలయాలు, మసీదుల మైకుల్లో ప్రజలకు ఇళ్లలోపలికి వెళ్లాలని సూచించారు. ప్రజలంతా భయం నుంచి తేరుకుని ఇళ్లలోకి వెళ్లగానే సరిగ్గా 11.25గంటల ప్రాంతంలో మరోసారి భారీ శబ్ధంతో ప్రకంపనలు వచ్చాయి.

బయటకు పరుగులు

మళ్లీ ప్రజలంతా బయటకు పరుగులు తీశారు. మరి కొంతమంది తమ బ్యాగులను సర్దుకుని నగరంలోని వారి బంధువుల ఇళ్లకు ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో వెళ్లిపోయారు. బోరబండతో పాటు పరిసర ప్రాంతాలైన బోరబండ వీకర్ సెక్షన్, పెద్దమ్మ నగర్, పి. అంజయ్యనగర్, వినాయకనగర్, బంజారానగర్, రెహమత్​నగర్​లోని కొన్ని ప్రాంతాలు, అల్లాపూర్ డివిజన్​లోని గాయత్రినగర్, పర్వత్​నగర్, తులసినగర్ ప్రాంతాల్లో భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: రక్తం కొరత.. తలసేమియా బాధితులకు తప్పని అవస్థ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.