ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణా... ఎడ్లబండ్లకు జరిమానా..! - కృష్ణాలో ఇసుక అక్రమ రవాణా వార్తలు

ముందు ఒకసారి ఇసుకను అక్రమంగా రవాణా చేసినప్పుడు హెచ్చరించారు. వినకపోగా... మళ్లీ అదే పని చేశారు. పోలీసులకు చిక్కారు. దీంతో పోలీసులు ఎడ్లబండ్ల యజమానులకు జరిమానా విధించారు.

due to Sand trafficking Fines imposed in mopidevi mandal in krishna
due to Sand trafficking Fines imposed in mopidevi mandal in krishna
author img

By

Published : May 2, 2020, 11:50 PM IST

కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కె. కొత్తపాలెం దగ్గర కృష్ణానది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 4 ఎడ్లబండ్లను పట్టుకున్నారు. వాటిని మోపిదేవి తహసీల్దార్ కార్యాలయానికి పంపినట్లు అవనిగడ్డ సీఐ బి.భీమేశ్వర రవికుమార్ తెలిపారు. పది రోజుల క్రితం అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 11 ఎడ్లబండ్లను పట్టుకున్నప్పటికీ వారిలో మార్పురాలేదని మండిపడ్డారు. అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎడ్లబండ్ల యజమానులకు జరిమానా విధించారు.

కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కె. కొత్తపాలెం దగ్గర కృష్ణానది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 4 ఎడ్లబండ్లను పట్టుకున్నారు. వాటిని మోపిదేవి తహసీల్దార్ కార్యాలయానికి పంపినట్లు అవనిగడ్డ సీఐ బి.భీమేశ్వర రవికుమార్ తెలిపారు. పది రోజుల క్రితం అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 11 ఎడ్లబండ్లను పట్టుకున్నప్పటికీ వారిలో మార్పురాలేదని మండిపడ్డారు. అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎడ్లబండ్ల యజమానులకు జరిమానా విధించారు.

ఇదీ చదవండి: కనీసం లక్ష పడకలు సిద్ధం చేయండి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.