విజయవాడ ఆంధ్ర ఆస్పత్రిలో గుండెకు సంబంధించి అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించినట్లు డాక్టర్ పి.వి. రామారావు వైద్య బృందం తెలిపింది. బాల కిశ్వత్ అనే ఎనిమిది నెలల బాలుడు క్లిష్టమైన గుండెవ్యాధితో బాధపడుతున్నాడని... 5 లక్షల మంది శిశువులలో ఒకరికి వచ్చే అరుదైన ఈ వ్యాధి.. ఇప్పటివరకు ప్రపంచంలో 130మంది లోనే గుర్తించినట్లు వివరాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.
ఆరోగ్యశ్రీ, ఆంధ్ర హాస్పిటల్స్ మదర్ అండ్ చైల్డ్ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో బాలుడికి ఆపరేషన్ చేసినట్లు ఆస్పత్రి చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ డైరక్టర్ చెప్పారు. ఈ శిశువుకు గుండె ఎడమ పక్క పెద్దగా ఉండటం, కుడి పక్క గుండె భాగాల నుంచి రక్తం.. ఊపిరితిత్తులకు వెళ్లే దగ్గర అడుపడుతుండడం వంటి లక్షణాల కారణంగా.. గుండె పరిమాణం పెరుగుతుండేదని చెప్పారు. కష్టతరమైన ఈ పరిస్థితులను అధిగమించి.. టీం వర్క్తో శస్త్రచికిత్సను సమర్థవంతంగా, విజయవంతంగా పూర్తి చేశామని సర్జన్ డాక్టర్ దిలీప్ చెప్పారు.
గుండె సమస్యతో పుట్టిన తన కుమారుడిని బతికించుకోటానికి ఎన్నో ఆసుపత్రులు తిరిగామని బాలుడి తల్లి కన్నీరు పెట్టుకుంది. చివరకు ఆంధ్ర హాస్పిటల్ యాజమాన్యం తమ బిడ్డ ప్రాణాలను కాపాడిందని చెప్పారు. ఇలాంటి అరుదైన శస్త్ర చికిత్సలకు.. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తే.. ఎంతో మంది తల్లులకు కడుపుశోకం తప్పుతుందని వైద్యులు చెప్పారు.
ఇదీ చదవండి: