కృష్ణా జిల్లా నందిగామలో మహ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్ ఉన్ నబీ పండుగను ఘనంగా చేసుకున్నారు. చిన్నారులు ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా జామా మసీదులో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాలు పట్టుకుని పట్టణంలో ఉరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్ రావు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: