దసరా వచ్చిందంటే ముందుగా మనందరికి గుర్తొచ్చేది గార్భా, దాండియా నృత్యాలే...సాంప్రదాయ దుస్తులు ధరించి...అంతా ఒక్కచోట చేరి దాండియా నృత్యాలు చేస్తుంటే చూసేవారికి సైతం ఆడిపాడాలనిపిస్తుంది. అలా ఆడాలనుకునేవారికి శిక్షణ కూడా ఇస్తుందీ...క్రియేటివ్ సోల్ అనే సంస్థ.
దసరా ఉత్సవాల సందర్భంగా గార్భా, దాండియా నృత్య పోటీలను గత మూడేళ్లుగా క్రియేటివ్ సోల్ సంస్థ విజయవాడలో నిర్వహిస్తోంది. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఎస్.ఎస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్లో స్త్రీలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొని ఆడిపాడారు. వివిధ కారణాలతో విజయవాడలో నివసిస్తున్న ఉత్తరాదీలకు... ఇలాంటి వేడుకలు నిర్వహించడం వల్ల తమ సొంతూరిలో ఉన్నంత సంతోషంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతాలకు అతీతంగా ఇటువంటి వేడుకల నిర్వహించడం పట్ల ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.
అత్యంత ఘనంగా జరిగిన ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ సతీమణి సుప్రవా హరించందన్ హాజరయ్యారు. ఈ మెగా ఈవెంట్లో విజేతలుగా నిలిచిన వారికి నిర్వహకులు బహుమతులు అందజేశారు.
ఇదీ చదవండి: నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి?