తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యలపై క్రైస్తవ సంఘాలు నిరసన వ్యక్తంచేశాయి. ఆయన మాటలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈమేరకు కృష్ణా జిల్లా మైలవరంలో క్రైస్తవ, దైవసంఘాల సేవకులు ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని లేదంటే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు
ఇవీ చదవండి: అక్రమంగా విక్రయిస్తున్న బంగారం పట్టివేత