ETV Bharat / state

మద్యం షాపులో చోరీ.. రూ.86వేల సరుకు మాయం

author img

By

Published : May 12, 2020, 7:19 PM IST

కృష్ణాజిల్లా విజయవాడ - ఆగిరిపల్లి రహదారి మధ్యలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దుకాణం రేకులు పగలగొట్టి రూ.86 వేల విలువైన సరుకును చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

chori at wine shop in krishna dst
chori at wine shop in krishna dst

ఆగిరిపల్లి నుంచి విజయవాడ వెళ్ళే రహదారి పక్కనున్న ప్రభుత్వ మద్యం దుకాణం పైన రేకులను గుర్తు తెలియని వ్యక్తి పగులగొట్టి వైన్ షాపులోకి ప్రవేశించారు. షాపులో ఉన్న రూ. 86 వేల విలువ చేసే మద్యం బాటిళ్లను దొంగతనం చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సీసీ టీవీలో నమోదైన దొంగ చిత్రాలను విడుదల చేశారు. దొంగని గుర్తించి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, వారికి రూ.10,000 బహుమతి కూడా ఇస్తామని తెలిపారు.

ఆగిరిపల్లి నుంచి విజయవాడ వెళ్ళే రహదారి పక్కనున్న ప్రభుత్వ మద్యం దుకాణం పైన రేకులను గుర్తు తెలియని వ్యక్తి పగులగొట్టి వైన్ షాపులోకి ప్రవేశించారు. షాపులో ఉన్న రూ. 86 వేల విలువ చేసే మద్యం బాటిళ్లను దొంగతనం చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సీసీ టీవీలో నమోదైన దొంగ చిత్రాలను విడుదల చేశారు. దొంగని గుర్తించి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, వారికి రూ.10,000 బహుమతి కూడా ఇస్తామని తెలిపారు.

ఇదీ చూడండి సీఎం క్యాంపు కార్యాలయం తరలించేందుకు చూస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.