ఇటీవలే నూతనంగా ప్రారంభించిన దుర్గగుడి ఫ్లై ఓవర్పై రాత్రి సమయాల్లో నగర వాసులు బైకుల మీద వచ్చి నిలబడి సెల్ఫీ దిగుతూ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారు. వంతెనపై నుంచే నగరాన్ని చూస్తూ ట్రాఫిక్ ఇబ్బందులకు గురి చేస్తుండటం మరో పక్క ప్రమాదాలకు గురవుతుండటం పట్ల భవానిపురం పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

మరోసారి ఇలాచేస్తే..
అనంతరం వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మరోసారి కారణం లేకుండా ఫ్లై ఓవర్పై వాహనం ఆపి ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చూడండి : '41 (ఏ)నోటీసు ఇవ్వకపోవటం కోర్టు ధిక్కరణ అవుతుంది'