ETV Bharat / state

బీసీ వసతి గృహంలో బాలుడి హత్య!

బీసీ వసతిగృహంలో చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. స్నానాల గది సమీపంలో రక్తపు మడుగులో పడిఉన్న మృతదేహాన్నిగుర్తించిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

author img

By

Published : Aug 6, 2019, 8:55 AM IST

Updated : Aug 6, 2019, 3:23 PM IST

boy-died-in-bc-welfare-hostel-at-krishna-dist
బీసీ వసతి గృహంలో బాలుడి హత్య!

కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ వసతి గృహంలో దారుణం జరిగింది. మూడో తరగతి చదువుతున్న చిన్నారి ఆదిత్య... రక్తపు మడుగులో శవంగా తేలాడు. హాస్టల్ లోని బాత్‌రూమ్‌ సమీపంలో విగతజీవిగా పడి ఉన్నాడు. ఆదిత్య మెడపై.. కత్తితో కోసినట్లు గాయముంది. అతడి మృతదేహాన్ని హాస్టల్‌ సిబ్బంది, విద్యార్థులు గమనించిన వెంటనే.. పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి 11 గంటలకు ఆదిత్యతో కలిసి బాత్​రూమ్​కు వెళ్లిన ఓ సహచర విద్యార్థి.. తిరిగి ఆదిత్య తనతోపాటు గదిలోకి రాలేదని చెప్పినట్టు హాస్టల్ సిబ్బంది తెలిపారు.

ఈ మధ్యలో ఏం జరిగింది.. అసలు ఆదిత్య ఎలా చనిపోయాడన్నదీ తేల్చే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెడపై ఉన్న గాయాన్ని కీలకంగా భావిస్తున్నారు. తోటి విద్యార్థుల మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా? బయటి వ్యక్తులు ఈ పని చేశారా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. మచిలీపట్నం నుంచి జాగిలాలను, క్లూస్‌ బృందాలను రంగంలోకి దించారు. మూడో తరగతి విద్యార్థులకు వసతి ఉన్న మొదటి అంతస్తును, ఆదిత్య చనిపోయిన స్థలాన్ని, పరిసరాలను పరిశీలించారు.

రెండు వసతి గృహాలకు ఒకే వార్డెన్

చల్లపల్లి, మోపిదేవికి ఒకే వార్డెన్‌ ఉంటున్నారు. సోమవారం చల్లపల్లిలో కాకుండా.. తనకు ఇన్‌ఛార్జి బాధ్యతలు ఉన్న మోపిదేవి వసతి గృహానికి వెళ్లారు. తన సహాయకుని ద్వారా జరిగిన ఘటన గురించి తెలుసుకుని హాస్టల్‌కు చేరుకున్నారు. విద్యార్ధులతో మాట్లాడారు. మరోవైపు.. తమకు ఒక్కగానొక్క కుమారుడని.. ఎవరితో తగాదాలు లేవని ఆదిత్య తల్లిదండ్రులు రవీంద్ర, రాజ్యలక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు.

ఇవి కూడా చదవండి:

వర్ష బీభత్సం: పలు రాష్ట్రాలు జలమయం

బీసీ వసతి గృహంలో బాలుడి హత్య!

కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ వసతి గృహంలో దారుణం జరిగింది. మూడో తరగతి చదువుతున్న చిన్నారి ఆదిత్య... రక్తపు మడుగులో శవంగా తేలాడు. హాస్టల్ లోని బాత్‌రూమ్‌ సమీపంలో విగతజీవిగా పడి ఉన్నాడు. ఆదిత్య మెడపై.. కత్తితో కోసినట్లు గాయముంది. అతడి మృతదేహాన్ని హాస్టల్‌ సిబ్బంది, విద్యార్థులు గమనించిన వెంటనే.. పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి 11 గంటలకు ఆదిత్యతో కలిసి బాత్​రూమ్​కు వెళ్లిన ఓ సహచర విద్యార్థి.. తిరిగి ఆదిత్య తనతోపాటు గదిలోకి రాలేదని చెప్పినట్టు హాస్టల్ సిబ్బంది తెలిపారు.

ఈ మధ్యలో ఏం జరిగింది.. అసలు ఆదిత్య ఎలా చనిపోయాడన్నదీ తేల్చే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెడపై ఉన్న గాయాన్ని కీలకంగా భావిస్తున్నారు. తోటి విద్యార్థుల మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా? బయటి వ్యక్తులు ఈ పని చేశారా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. మచిలీపట్నం నుంచి జాగిలాలను, క్లూస్‌ బృందాలను రంగంలోకి దించారు. మూడో తరగతి విద్యార్థులకు వసతి ఉన్న మొదటి అంతస్తును, ఆదిత్య చనిపోయిన స్థలాన్ని, పరిసరాలను పరిశీలించారు.

రెండు వసతి గృహాలకు ఒకే వార్డెన్

చల్లపల్లి, మోపిదేవికి ఒకే వార్డెన్‌ ఉంటున్నారు. సోమవారం చల్లపల్లిలో కాకుండా.. తనకు ఇన్‌ఛార్జి బాధ్యతలు ఉన్న మోపిదేవి వసతి గృహానికి వెళ్లారు. తన సహాయకుని ద్వారా జరిగిన ఘటన గురించి తెలుసుకుని హాస్టల్‌కు చేరుకున్నారు. విద్యార్ధులతో మాట్లాడారు. మరోవైపు.. తమకు ఒక్కగానొక్క కుమారుడని.. ఎవరితో తగాదాలు లేవని ఆదిత్య తల్లిదండ్రులు రవీంద్ర, రాజ్యలక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు.

ఇవి కూడా చదవండి:

వర్ష బీభత్సం: పలు రాష్ట్రాలు జలమయం

Intro:స్క్రిప్ట్ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదన్ రెడ్డి కడప జిల్లాలో సోమవారం పర్యటించారు నెలకొన్న పరిస్థితులు ప్రకృతి వ్యవసాయం సాగు చేసిన పంటలను ఆయన పరిశీలించారు జిల్లాలోని రామాపురం లక్కిరెడ్డిపల్లి రాయచోటి మండలాలలో వర్షాధారంగా సాగు చేసిన వేరుశనగ ఇతర పంటలను పరిశీలించారు భూగర్భ జల మట్టం భూసార పరీక్ష ఫలితాలపై అధికారులతో సమీక్షించారు సాగు విధానాల్లో పంటలు కోల్పోతున్న విధానాలపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు ఆయన వెంట జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు క్షేత్రస్థాయిలో పరిశీలించిన వ్యవసాయ రంగ అనుబంధ అ పంటల సాగు ఇతర విషయాలపై ప్రభుత్వానికి ఒక నివేదిక అందిస్తామని రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు కడప జిల్లాలో పంటల సాగు పరిస్థితి ఇ దారుణంగా ఉందని కేవలం 15 శాతం మించి పంటలు సాగు కాలేదన్నారు వర్షాభావంతో సాగుతో పాటు సాగులో ఉన్న పంటలు కూడా దెబ్బ తింటున్న పరిస్థితి నెలకొందని రైతులకు ప్రభుత్వ అందజేసిన 27 వేల క్వింటాళ్ల విత్తన కాయల కూడా పూర్తిస్థాయిలో విత్తు వేసే పరిస్థితి లేకపోయిందని ఆయన వివరించారు వ్యవసాయ బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అని వివరించారు కరువు పరిస్థితుల తో నష్టపోతున్న తమకు సాగు నీరందించి వ్యవసాయ యాంత్రీకరణ కు రాయితీలు మరింత పెంచాలని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు మురళీకృష్ణ రాయచోటి లక్కిరెడ్డిపల్లె డివిజన్ లో ఎ డి ఎ లు సావిత్రి మురళీధర్ రెడ్డి వ్యవసాయ ఉద్యాన పశు సంవర్థక శాఖ ల అధికారులు పాల్గొన్నారు


Body:ఓన్లీ రిజల్ట్స్


Conclusion:ఓన్లీ విజువల్స్ 58వ ఫుల్ గా మధుసూదన్ రెడ్డి వాయిస్ వేస్తున్నాను
Last Updated : Aug 6, 2019, 3:23 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.