ETV Bharat / state

'కరోనా పరీక్షకు వస్తే.. కిట్లు లేవని పొమ్మనటం భావ్యమా'

author img

By

Published : Jul 27, 2020, 12:41 AM IST

రాష్ట్రంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లో సైతం వైరస్​ వేగంగా వ్యాపిస్తోంది. సరైన సమయంలో వైద్యం అందక చనిపోయేవారు కొందరైతే... తమకు వైరస్​ సోకిందని తెలియక ప్రాణం మీదకు తెచ్చుకునే వారు మరికొందరు. తాజాగా కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ప్రాథమిక కేంద్రాల్లో శాసన సభ్యులు సింహాద్రి రమేశ్​ బాబు పరిశీలించి, ప్రజలకు అందించాల్సిన వైద్య సేవలపై తగు జాగ్రత్తలు సూచించారు.

mla fires on doctors irresponsibility at krishna district
'కరోనా పరీక్ష చేయమని వస్తే కిట్లు లేవు పొమ్మనటం భావ్యమా'

కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్​ సోకిందని తెలియక ప్రాణాల మీదకి తెచ్చుకుని మరణాలు సంభవించాయి. కోడూరు మండలం స్వతంత్రపురం, మందపాకల గ్రామలలోని ప్రాథమిక కేంద్రాలను అవనిగడ్డ శాసన సభ్యులు సింహాద్రి రమేశ్​ బాబు పరిశీలించారు. మహమ్మారి పై తగు జాగ్రత్తలు సూచించారు.

ఒక వ్యక్తి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయేమోనని భయభ్రాంతులతో వైద్య పరీక్షలకు వస్తే.. 'ఇక్కడ కరోనా పరీక్ష కిట్లు లేవు అవనిగడ్డ వెళ్లమనడం మీకు భావ్యమా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి పీహెచ్​సీలో కరోనా కిట్లు ఉన్నాయా? లేవా? అని వైద్యులను ప్రశ్నించగా... 40 పరీక్ష కిట్లు ఉన్నాయని, వైద్య పరీక్షలకు ఎవరూ వచ్చినా చికిత్సలు అందిస్తామని తెలిపారు.

కుక్క కాటు, పాము కాటు మొదలగు వైద్యసేవలు, వ్యాధులకు మండలం నుంచి ఏ వ్యక్తి వైద్యానికి వచ్చినా వారికి వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత మీదేనని పునరుద్ఘాటించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కరోనా అనుమానంతో ఏ వ్యక్తి వచ్చినా వారికి వెంటనే టెస్ట్​లు చేయాలని వైద్యులకు సూచించారు. దివి మార్కెట్​ ఛైర్మన్​ కడవకొల్లు నరసింహారావు, అవనిగడ్డ సర్కిల్​ ఇన్​స్పెక్టర్​ బి.భీమేశ్వర్​ రవికుమార్​, కోడూరు ఎస్​.ఐ రమేశ్​ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవీ చదవండి:వీడియో: కార్గిల్ యుద్ధం ఎలా జరిగిందో తెలుసా?

కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్​ సోకిందని తెలియక ప్రాణాల మీదకి తెచ్చుకుని మరణాలు సంభవించాయి. కోడూరు మండలం స్వతంత్రపురం, మందపాకల గ్రామలలోని ప్రాథమిక కేంద్రాలను అవనిగడ్డ శాసన సభ్యులు సింహాద్రి రమేశ్​ బాబు పరిశీలించారు. మహమ్మారి పై తగు జాగ్రత్తలు సూచించారు.

ఒక వ్యక్తి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయేమోనని భయభ్రాంతులతో వైద్య పరీక్షలకు వస్తే.. 'ఇక్కడ కరోనా పరీక్ష కిట్లు లేవు అవనిగడ్డ వెళ్లమనడం మీకు భావ్యమా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి పీహెచ్​సీలో కరోనా కిట్లు ఉన్నాయా? లేవా? అని వైద్యులను ప్రశ్నించగా... 40 పరీక్ష కిట్లు ఉన్నాయని, వైద్య పరీక్షలకు ఎవరూ వచ్చినా చికిత్సలు అందిస్తామని తెలిపారు.

కుక్క కాటు, పాము కాటు మొదలగు వైద్యసేవలు, వ్యాధులకు మండలం నుంచి ఏ వ్యక్తి వైద్యానికి వచ్చినా వారికి వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత మీదేనని పునరుద్ఘాటించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కరోనా అనుమానంతో ఏ వ్యక్తి వచ్చినా వారికి వెంటనే టెస్ట్​లు చేయాలని వైద్యులకు సూచించారు. దివి మార్కెట్​ ఛైర్మన్​ కడవకొల్లు నరసింహారావు, అవనిగడ్డ సర్కిల్​ ఇన్​స్పెక్టర్​ బి.భీమేశ్వర్​ రవికుమార్​, కోడూరు ఎస్​.ఐ రమేశ్​ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవీ చదవండి:వీడియో: కార్గిల్ యుద్ధం ఎలా జరిగిందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.