కృష్ణా జిల్లా నందివాడ మండలం వెన్నపూడి గ్రామంలో ప్రభుత్వానికి చెందిన భూమిని మత్య్స సహకార సంఘానికి లీజుకిచ్చారు. వారు ఆ భూమిలో చేపల చెరువును నిర్మించుకున్నారు. స్థానిక రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ... ఇది ప్రభుత్వ భూమి కాదని, తమ సొంత భూమి అని ఘర్షణకు దిగారు. ఈ విషయమై ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని సహకార సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఇదీచదవండి.