ETV Bharat / state

ఆర్టీసీలో కారుణ్య నియామకాల ప్రక్రియ కలెక్టర్లకు అప్పగింత

ఈనెల 16లోగా కారుణ్య నియామక దరఖాస్తుల వివరాలను కలెక్టర్లకు పంపాలని ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యారు. దీంతో కారుణ్య నియామకాలు ప్రభుత్వం చేపట్టాల్సి ఉంటుంది. ఇకపై ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ ప్రక్రియను కొనసాగించనున్నారు.

author img

By

Published : Jul 14, 2020, 10:31 PM IST

apsrtc karuna
apsrtc karuna

ఏపీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2016 జనవరి 1 నుంచి విధి నిర్వహణలో చనిపోయిన కార్మికుల వివరాలు, కారుణ్య నియామకం కోసం కుటుంబ సభ్యులు పెట్టుకున్న దరఖాస్తులు, ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపాలని అధికారులను ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాల ఆర్ఎంలకు ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.

ఈనెల 16లోగా కారుణ్య నియామక దరఖాస్తుల వివరాలు కలెక్టర్లకు పంపాలని ఆదేశాల్లో తెలిపారు. 2015 డిసెంబర్ 31 వరకు చనిపోయిన కుటుంబాలకు ఆర్టీసీ కారుణ్య నియాకాలను గతేడాది అక్టోబర్ లో చేపట్టింది. అర్హత కల్గిన కుటుంబ సభ్యులకు సంస్థలో ఉద్యోగాలిచ్చింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యారు. దీంతో కారుణ్య నియామకాలు ప్రభుత్వం చేపట్టాల్సి ఉంటుంది. ఇకపై ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ ప్రక్రియను కొనసాగించనున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకూ కారుణ్య నియామకం వర్తిస్తుందని విలీన అధ్యయన కమిటీ సిఫార్సును ప్రభుత్వం ఆమోదించింది. దీంతో కారుణ్య నియామకాలు చేపట్టేలా.. అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఉద్యోగి చనిపోయిన రెండేళ్లలోపు కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి కండక్టర్లు, శ్రామిక్ ఉద్యోగం ఇవ్వనున్నారు. కండక్టర్ పోస్టుకు 21 సంవత్సరాలు, శ్రామిక్ పోస్టుకు 18 ఏళ్లు నిండి ఉండాలి. పదో తరగతి తప్పనిసరిగా పాసై ఉండాలి. వీరందరి దరఖాస్తులను పరిశీలించి సంబంధిత జిల్లాల కలెక్టర్లు పబ్లిక్ ట్రాన్స్ పోర్టు డిపార్టు మెంట్ .. పీటీడీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్​: పంద్రాగస్టు వేడుకల్లో భారీ మార్పులు

ఏపీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2016 జనవరి 1 నుంచి విధి నిర్వహణలో చనిపోయిన కార్మికుల వివరాలు, కారుణ్య నియామకం కోసం కుటుంబ సభ్యులు పెట్టుకున్న దరఖాస్తులు, ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపాలని అధికారులను ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాల ఆర్ఎంలకు ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.

ఈనెల 16లోగా కారుణ్య నియామక దరఖాస్తుల వివరాలు కలెక్టర్లకు పంపాలని ఆదేశాల్లో తెలిపారు. 2015 డిసెంబర్ 31 వరకు చనిపోయిన కుటుంబాలకు ఆర్టీసీ కారుణ్య నియాకాలను గతేడాది అక్టోబర్ లో చేపట్టింది. అర్హత కల్గిన కుటుంబ సభ్యులకు సంస్థలో ఉద్యోగాలిచ్చింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యారు. దీంతో కారుణ్య నియామకాలు ప్రభుత్వం చేపట్టాల్సి ఉంటుంది. ఇకపై ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ ప్రక్రియను కొనసాగించనున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకూ కారుణ్య నియామకం వర్తిస్తుందని విలీన అధ్యయన కమిటీ సిఫార్సును ప్రభుత్వం ఆమోదించింది. దీంతో కారుణ్య నియామకాలు చేపట్టేలా.. అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఉద్యోగి చనిపోయిన రెండేళ్లలోపు కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి కండక్టర్లు, శ్రామిక్ ఉద్యోగం ఇవ్వనున్నారు. కండక్టర్ పోస్టుకు 21 సంవత్సరాలు, శ్రామిక్ పోస్టుకు 18 ఏళ్లు నిండి ఉండాలి. పదో తరగతి తప్పనిసరిగా పాసై ఉండాలి. వీరందరి దరఖాస్తులను పరిశీలించి సంబంధిత జిల్లాల కలెక్టర్లు పబ్లిక్ ట్రాన్స్ పోర్టు డిపార్టు మెంట్ .. పీటీడీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్​: పంద్రాగస్టు వేడుకల్లో భారీ మార్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.