ETV Bharat / state

యాప్​లో నమోదు చేస్తే..ఎక్కడికి వెళ్లాలో చెబుతారు

జ్వరం, జలుబు, దగ్గు వంటి కరోనా అనుమానిత లక్షణాలతో ఉండే వారికి పరీక్షలు నిర్వహించేందుకు.... ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం కొవిడ్‌ 19 ఏపీ పేరుతో ఓ యాప్‌ను రూపొందించింది. అనుమానితులు అందులో పేరు నమోదు చేసుకుంటే... సమీపంలో ఉండే ఏ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తారో తెలియజేస్తుందని సర్కార్‌ తెలిపింది.

author img

By

Published : Jun 11, 2020, 2:59 AM IST

Updated : Jun 11, 2020, 4:21 AM IST

covid-
covid-

కరోనా అనుమానంతో ఉండి వైద్యులను సంప్రదించడానికి ఇబ్బందులు పడుతున్న వారి కోసం ప్రభుత్వం యాప్‌ను తయారుచేసింది. కొవిడ్‌ 19 ఏపీ పేరుతో ఈ యాప్‌ను రూపొందించింది. అందులో అడిగిన మేరకు చిరునామా, ఇతర వివరాలు నమోదు చేయగానే సమీపంలో ఉన్న ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రం, వైద్యుని పేర్లను తెలియచేస్తూ అతని ఫోన్‌కు ఎస్​ఎంఎస్ వస్తుంది. వైద్యుడిని సంప్రదించిన వెంటనే నమూనా సేకరిస్తారు. ఇలా ఎవరైనా అనుమానిత లక్షణాలతో ఉండి పరీక్షలు చేయించుకోవాలనుకునే వారికి వైద్య ఆరోగ్య శాఖ ఈ విధమైన ఏర్పాట్లు చేసింది. సూచించిన ఆస్పత్రికి వెళ్లగానే వైద్యులు నిర్ణీత సమయంలో నమూనాలను సేకరించి పరీక్షిస్తారని ప్రభుత్వం తెలిపింది.

గతంలో రాష్ట్ర వ్యాప్తంగా తీసిన నమూనాలను తిరుపతి స్విమ్స్‌లో మాత్రమే పరీక్షించగా.... తర్వాత అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం జిల్లా, సామాజిక, ప్రాంతీయ ఆస్పత్రుల్లోనే కాకుండా ఎంపిక చేసిన పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం నమూనాల సేకరణ, పరీక్షలు చేస్తున్నారు. గుంటూరు నగరంలో 11 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా 5 చోట్ల నమూనాలు సేకరిస్తున్నారు. శ్రీకాకుళం, పలాసలో కలిపి 5 చోట్ల నిర్ణీత వేళల్లో అనుమానిత లక్షణాలతో వచ్చిన వారి నుంచి నమూనాలు తీస్తున్నారు

జిల్లాలో కనీసం 60 నుంచి 110, 120 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో కనీసం 15 % నుంచి 20 % వరకు ఎంపికచేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ నమూనాల సేకరణ జరుగుతోంది. ఈ కేంద్రాల్లో ఎవరైనా స్వయంగానే నమూనా ఇవ్వొచ్చు. ఇంటింటి సర్వే ద్వారా ఆరోగ్య సిబ్బంది అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వారిని... కేంద్రాలకు వెళ్లి నమూనాలు ఇవ్వమని సూచిస్తున్నారు. పరీక్షల కోసం వచ్చిన వ్యక్తిని వైద్యులు వివరాలు సేకరించి అనుమానిత లక్షణాలు ఉన్నట్లు నిర్థరించుకున్న అనంతరమే నమూనాలు సేకరించి పరీక్షలకు పంపుతున్నారు. రెండు రోజుల్లోగా ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.

శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో నమూనాలను సేకరించేందుకు ప్రత్యేక వ్యాన్‌లు ఏర్పాటు చేశారు. దేశంలో 600ట్రూనాట్‌ మిషన్లు ఉంటే రాష్ట్రంలో ప్రస్తుతం 345 ఉన్నాయని త్వరలో మరో వంద మిషన్లు రాబోతున్నాయని అధికారులు తెలిపారు. వీటి ద్వారా రానున్న నెల రోజుల్లో కనీసం రోజుకి 30 వేల వరకు పరీక్షలు చేసేందుకు వీలుంటుందని వివరించారు.

ఇవీ చదవండి

లాక్ డౌన్ ఎఫెక్ట్.... హోటల్ వైపు చూడని ఆహార ప్రియులు

కరోనా అనుమానంతో ఉండి వైద్యులను సంప్రదించడానికి ఇబ్బందులు పడుతున్న వారి కోసం ప్రభుత్వం యాప్‌ను తయారుచేసింది. కొవిడ్‌ 19 ఏపీ పేరుతో ఈ యాప్‌ను రూపొందించింది. అందులో అడిగిన మేరకు చిరునామా, ఇతర వివరాలు నమోదు చేయగానే సమీపంలో ఉన్న ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రం, వైద్యుని పేర్లను తెలియచేస్తూ అతని ఫోన్‌కు ఎస్​ఎంఎస్ వస్తుంది. వైద్యుడిని సంప్రదించిన వెంటనే నమూనా సేకరిస్తారు. ఇలా ఎవరైనా అనుమానిత లక్షణాలతో ఉండి పరీక్షలు చేయించుకోవాలనుకునే వారికి వైద్య ఆరోగ్య శాఖ ఈ విధమైన ఏర్పాట్లు చేసింది. సూచించిన ఆస్పత్రికి వెళ్లగానే వైద్యులు నిర్ణీత సమయంలో నమూనాలను సేకరించి పరీక్షిస్తారని ప్రభుత్వం తెలిపింది.

గతంలో రాష్ట్ర వ్యాప్తంగా తీసిన నమూనాలను తిరుపతి స్విమ్స్‌లో మాత్రమే పరీక్షించగా.... తర్వాత అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం జిల్లా, సామాజిక, ప్రాంతీయ ఆస్పత్రుల్లోనే కాకుండా ఎంపిక చేసిన పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం నమూనాల సేకరణ, పరీక్షలు చేస్తున్నారు. గుంటూరు నగరంలో 11 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా 5 చోట్ల నమూనాలు సేకరిస్తున్నారు. శ్రీకాకుళం, పలాసలో కలిపి 5 చోట్ల నిర్ణీత వేళల్లో అనుమానిత లక్షణాలతో వచ్చిన వారి నుంచి నమూనాలు తీస్తున్నారు

జిల్లాలో కనీసం 60 నుంచి 110, 120 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో కనీసం 15 % నుంచి 20 % వరకు ఎంపికచేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ నమూనాల సేకరణ జరుగుతోంది. ఈ కేంద్రాల్లో ఎవరైనా స్వయంగానే నమూనా ఇవ్వొచ్చు. ఇంటింటి సర్వే ద్వారా ఆరోగ్య సిబ్బంది అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వారిని... కేంద్రాలకు వెళ్లి నమూనాలు ఇవ్వమని సూచిస్తున్నారు. పరీక్షల కోసం వచ్చిన వ్యక్తిని వైద్యులు వివరాలు సేకరించి అనుమానిత లక్షణాలు ఉన్నట్లు నిర్థరించుకున్న అనంతరమే నమూనాలు సేకరించి పరీక్షలకు పంపుతున్నారు. రెండు రోజుల్లోగా ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.

శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో నమూనాలను సేకరించేందుకు ప్రత్యేక వ్యాన్‌లు ఏర్పాటు చేశారు. దేశంలో 600ట్రూనాట్‌ మిషన్లు ఉంటే రాష్ట్రంలో ప్రస్తుతం 345 ఉన్నాయని త్వరలో మరో వంద మిషన్లు రాబోతున్నాయని అధికారులు తెలిపారు. వీటి ద్వారా రానున్న నెల రోజుల్లో కనీసం రోజుకి 30 వేల వరకు పరీక్షలు చేసేందుకు వీలుంటుందని వివరించారు.

ఇవీ చదవండి

లాక్ డౌన్ ఎఫెక్ట్.... హోటల్ వైపు చూడని ఆహార ప్రియులు

Last Updated : Jun 11, 2020, 4:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.