రానున్న రోజుల్లో అన్ని రంగాల్లోనూ రోబోల శకం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ రంగం ద్వారా విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు యూరోపియన్ మెకాట్రానిక్స్ సంస్థ అధ్యక్షుడు నాగరాజు. ఇందుకోసం రాష్ట్రంలో ఇప్పటికే పలు కళాశాలలు జర్మనీలోని మెకాట్రానిక్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాయి. తాజాగా విజయవాడలోని ఆంధ్రాలయోలా ఇంజనీరింగ్ కళాశాల సైతం ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కళాశాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులు 15 రోజుల పాటు రోబోటిక్స్ బోధనలో తర్ఫీదు పొందారు. అడ్వాన్స్డ్ రోబోటిక్ కంట్రోల్ కోర్సు చేయాలనుకునే విద్యార్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. కోర్సుకు అయ్యే ఖర్చులో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 45 శాతం, మెకాట్రానిక్స్ సంస్థ 45 శాతం భరించనుంది. కేవలం 10 శాతం రుసుమును విద్యార్థులు చెల్లిస్తే సరిపోతుందని నాగరాజు తెలిపారు.
ఇవీ చూడండి...