నందిగామలో 'అమరావతి' నిరసనలు - amaravathi jac protest at nandigama
రాజధాని రైతుల ఆందోళనలకు ఇతర ప్రాంతాల ప్రజల మద్దతు కొనసాగుతోంది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అక్కడ దీక్ష చేపట్టిన రైతులకు సంఘీభావంగా కృష్ణా జిల్లా నందిగామలో ఏర్పాటైన శిబిరం 47 రోజులుగా కొనసాగుతోంది. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రైతుల త్యాగాలను గౌరవించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.