ETV Bharat / state

తల్లి చనిపోయినా.. పరీక్ష రాసిన విద్యార్థిని

పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించాలని పొద్దుపోయే వరకు చదువుకుంది. పుస్తకాలతో కుస్తీ పడుతూనే నిద్రపోయింది. పరీక్షకు హాజరవ్వాలని తెల్లవారుఝామున నిద్రలేచే సరికి ఇల్లంతా ఏడుపులతో నిండిపోయింది. రాత్రంతా చిన్నారికి తోడుగా ఉండి చదవించిన  ఆమె తల్లి... ఉదయం గుండెపోటుతో మరణించింది. హృదయమంతా బాధతో నిండినా... మంచి ఉత్తీర్ణత సాధించాలన్న తన తల్లి మాటలు గుర్తు వచ్చి పరీక్షకు హాజరైంది ఆ పదో తరగతి విద్యార్థి.

author img

By

Published : Mar 23, 2019, 3:09 PM IST

చిన్నారి చందనా
చిన్నారి చందనా
కృష్ణా జిల్లా తోటరావులపాడులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. చందనఅనే పదో తరగతి విద్యార్థిని తల్లి..తెల్లవారుఝామున గుండె పోటుతో మృతి చెందింది. ఇంత బాధలోనూ చందన..ఇంగ్లిష్ పరీక్షకు హాజరైంది. చంద్రపాడు మండలంలో ముప్పాళ్ల పాఠశాలలో పరీక్ష రాసింది. ఒకవైపు తల్లి మృతదేహం ఇంటిలో ఉండగానే... చందననిు బంధువులు ఆటోలో పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చారు. కన్నీళ్లు దిగమింగుకుంటానే ఆ విద్యార్థి పరీక్ష రాసింది.

చిన్నారి చందనా
కృష్ణా జిల్లా తోటరావులపాడులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. చందనఅనే పదో తరగతి విద్యార్థిని తల్లి..తెల్లవారుఝామున గుండె పోటుతో మృతి చెందింది. ఇంత బాధలోనూ చందన..ఇంగ్లిష్ పరీక్షకు హాజరైంది. చంద్రపాడు మండలంలో ముప్పాళ్ల పాఠశాలలో పరీక్ష రాసింది. ఒకవైపు తల్లి మృతదేహం ఇంటిలో ఉండగానే... చందననిు బంధువులు ఆటోలో పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చారు. కన్నీళ్లు దిగమింగుకుంటానే ఆ విద్యార్థి పరీక్ష రాసింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.