ETV Bharat / state

జగన్​ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23వేలు.. అధికారంలోకి వచ్చాక 717.. ఏమిటీ మాయాజాలం..!

author img

By

Published : Apr 5, 2023, 10:02 AM IST

MEGA DSC NOTIFICATION: నిరుద్యోగుల గోడు విన్నాను.. మీకు నేను ఉన్నాను.. మెగా డీఎస్సీ వేస్తానంటూ ప్రతిపక్ష నేతగా ప్రతి సభలోనూ జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మూడున్నరేళ్లలో ఒక్క పెద్ద డీఎస్సీ నిర్వహించలేదు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న నిబంధన కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందనే విమర్శలున్నాయి. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు పోస్టుల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్‌), తరగతుల విలీనం, 1-8 తరగతుల్లో ఒకే మాధ్యమం అమలు చేయడంతో పోస్టులు భారీగా రద్దయిపోయాయి. ఇంతకాలం ఉపాధ్యాయ నియామకాలు ఉంటాయని ఆశతో ఎదురు చూసిన నిరుద్యోగులకు ప్రభుత్వం చివరికి మొండిచేయి చూపింది.

MEGA DSC NOTIFICATION
MEGA DSC NOTIFICATION
ఏమిటీ మాయాజలం..! జగన్​ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23వేలు.. అధికారంలోకి వచ్చాక 717

MEGA DSC NOTIFICATION : ప్రతిపక్షనేతగా జగన్‌ ఉన్నప్పుడు 23వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా కనిపించాయి.. ఆయన అధికారంలోకి రాగానే మాయాజాలం చేసినట్లు అదృశ్యమైపోయాయి. ఇంద్రజాలికులే ఆశ్చర్యపోయేలా పోస్టులను మాయం చేసేశారు. పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ఏమైనా నిర్వహించారా అంటే అదీ లేదు. ఇప్పుడు ఖాళీలు కేవలం 717 మాత్రమే ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మరోపక్క జులై, ఆగస్టుల్లో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని ఆయనే మరో ప్రకటన చేశారు. జిల్లాల వారీగా ఖాళీలు, అదనపు అవసరాల వివరాలతో నివేదిక రూపొందిస్తామని వెల్లడించారు. ఖాళీలే 717 ఉన్నాయని ప్రకటించిన తరవాత కొత్తవి ఎక్కడి నుంచి వస్తాయి? 717 పోస్టుల భర్తీకే మెగా డీఎస్సీ నిర్వహిస్తారా? అనే సందేహం నిరుద్యోగుల్లో వ్యక్తమవుతోంది.

"డీఎస్సీకి సంబంధించి 23 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క తేల్చారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేసి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను నింపాలి. మన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి. 23వేల పోస్టులు ఖాళీగా ఉంటే చంద్రబాబు కేవలం 7,900 పోస్టులకు డీఎస్సీ ఇచ్చారు. మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ పెడతామని ప్రతి పిల్లవాడికీ చెబుతున్నా"-ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ

పోస్టులు మింగేసిన మంత్రదండం.. ప్రాథమిక విద్యలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపు కోసమంటూ ప్రపంచ బ్యాంకుతో కలిసి పాఠశాల విద్యాశాఖ ‘ఆంధ్ర అభ్యసన పరివర్తన’ ప్రాజెక్టు చేపట్టింది. ఇందుకు ప్రపంచ బ్యాంకు రూ.1,862 కోట్లు రుణంగా అందిస్తుంది. ఇందులో భాగంగా అదనపు నియామకాలను కనీస స్థాయిలో ఉంచడం ద్వారా డిపార్ట్‌మెంట్‌ మానవ వనరులపై చేసే వ్యయాన్ని తగ్గిస్తామని ప్రభుత్వమే నిబంధన పెట్టింది. ఇది ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభావం చూపింది. ఈ ప్రభుత్వం వచ్చాక నిర్వహించిన బదిలీల సమయంలో 15వేల పోస్టులను బ్లాక్‌ చేసింది. 3-10 తరగతులు ఉన్న బడుల్లో 6,578మంది, 6-10 తరగతులకు 1,350 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు అవసరం కానున్నట్లు అధికారులు గతంలో లెక్కలు తేల్చారు. ఇప్పుడు వీటిని సర్దుబాటు చేసేశారు.

మాయాజాలం ఇలా
మాయ-1: 1-8 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమం ఒక్కటే అమలు చేశారు. దీంతో ఇప్పటి వరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉండగా.. తెలుగు మాధ్యమం వారిని మిగులుగా తేల్చి వీరిని సర్దుబాటు చేసేశారు. ఒకే మాధ్యమం అమలును ఒక్కో ఏడాది పొడిగించుకుంటూ వచ్చే ఏడాది తొమ్మిది, ఆ తర్వాత పదో తరగతికి అమలు చేయనున్నారు. అంటే భవిష్యత్తులోనూ ఖాళీలు వచ్చే పరిస్థితి లేదు.

మాయ-2: తరగతిలోని సెక్షన్లలో విద్యార్థుల సంఖ్యను పెంచేశారు. 9, 10 తరగతుల్లో 60మంది వరకు ఒకే సెక్షన్‌ చేయగా.. 6-8 తరగతులకు 52 మంది వరకు ఒక్కటే సెక్షన్‌గా పెట్టారు.దీంతో ఉపాధ్యాయుల అవసరం తగ్గిపోయింది.

మాయ-3: 3 నుంచి 10 తరగతులు ఉండే హైస్కూల్‌లో 137మందికి పైగా విద్యార్థులు ఉంటేనే ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ పోస్టును ఇచ్చారు. దీంతో చాలా బడులకు ఈ రెండు పోస్టులు పోయాయి.

మాయ-4: 6-10 తరగతులున్న పాఠశాలలో 92మందికిపైగా పిల్లలు ఉంటేనే ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారు. పిల్లలు తక్కువగా ఉన్నచోట పోస్టులు రద్దైపోయాయి.

మాయ-5: 3-8 తరగతులున్న బడుల్లో 98 మందిలోపు ఉంటే సబ్జెక్టు ఉపాధ్యాయులను తీసేశారు. ఇలాంటి చోట 30మందికి ఒక్క సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ) చొప్పున కేటాయించారు. మూడో తరగతికి సబ్జెక్టు ఉపాధ్యాయుడితో బోధిస్తామని చెప్పిన ప్రభుత్వం పిల్లలు తక్కువగా ఉన్నారని, ఇక్కడ ఈ నిబంధనకు ఎగనామం పెట్టింది.

మాయ-6: 3, 4, 5 తరగతులకు సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధనంటూ కొత్త విధానాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కిలోమీటరు దూరంలోని 4,731 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4 ,5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత బడులకు తరలించేశారు. అదనపు గదులు లేనందున 8,412 బడుల తరలింపు పెండింగ్‌లో పెట్టారు. గదుల నిర్మాణం పూర్తయితే వీటిని తరలించేస్తారు. విలీనం కారణంగా 1, 2 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. 20లోపు పిల్లలు ఉన్న 6,755 బడులు ఏకోపాధ్యాయడితో కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో దీన్ని రెండు, మూడు కిలోమీటర్లకు విస్తరిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇదే జరిగితే భవిష్యత్తులో ఉపాధ్యాయ పోస్టులు ఇంకా భారీగా తగ్గిపోతాయి. తరగతుల విలీనంతో ఎస్జీటీలకు వందశాతం పదోన్నతులు ఇచ్చి, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయులుగా సర్దుబాటు చేసేశారు.

ఉన్నవాటినీ రద్దు చేసేశారు..
కొత్త నియామకాలు దేవుడెరుగు.. ఉన్న పోస్టులనే రద్దు చేసేశారు. ఆదర్శ పాఠశాలల్లోని 3,260 పోస్టులకు సర్వీసు నిబంధనల కోసమంటూ 4,764 ఎస్జీటీ పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. కర్నూలు జిల్లా మినహా ఉమ్మడి 12 జిల్లాల్లో 397 చొప్పున పోస్టులను విలీనం చేసింది.

* నూతన జాతీయ విద్యా విధానంలో ఆర్ట్‌, క్రాఫ్ట్‌ పోస్టులకు ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వం మాత్రం వీటిని రద్దు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,145 ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసింది.

* అయిదు అదనపు డైరెక్టర్ల పోస్టులను సృష్టించేందుకు 2021 అక్టోబరులో మరో 15 ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ ఉపాధ్యాయ పోస్టులను విలీనం చేశారు.

* రాష్ట్రవ్యాప్తంగా 1,79,263 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా.. హేతుబద్ధీకరణతో వీటిని 1,50,641కి కుదించేసింది. దీనికి డీఎస్సీ-98 ఒప్పంద పోస్టులను మినహాయిస్తే వచ్చే ఖాళీలు 5,251లను కలిపినా.. సర్దుబాటు కింద 23వేలకుపైగా పోస్టులు పోయాయి.

ఇవీ చదవండి:

ఏమిటీ మాయాజలం..! జగన్​ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23వేలు.. అధికారంలోకి వచ్చాక 717

MEGA DSC NOTIFICATION : ప్రతిపక్షనేతగా జగన్‌ ఉన్నప్పుడు 23వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా కనిపించాయి.. ఆయన అధికారంలోకి రాగానే మాయాజాలం చేసినట్లు అదృశ్యమైపోయాయి. ఇంద్రజాలికులే ఆశ్చర్యపోయేలా పోస్టులను మాయం చేసేశారు. పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ఏమైనా నిర్వహించారా అంటే అదీ లేదు. ఇప్పుడు ఖాళీలు కేవలం 717 మాత్రమే ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మరోపక్క జులై, ఆగస్టుల్లో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని ఆయనే మరో ప్రకటన చేశారు. జిల్లాల వారీగా ఖాళీలు, అదనపు అవసరాల వివరాలతో నివేదిక రూపొందిస్తామని వెల్లడించారు. ఖాళీలే 717 ఉన్నాయని ప్రకటించిన తరవాత కొత్తవి ఎక్కడి నుంచి వస్తాయి? 717 పోస్టుల భర్తీకే మెగా డీఎస్సీ నిర్వహిస్తారా? అనే సందేహం నిరుద్యోగుల్లో వ్యక్తమవుతోంది.

"డీఎస్సీకి సంబంధించి 23 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క తేల్చారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేసి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను నింపాలి. మన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి. 23వేల పోస్టులు ఖాళీగా ఉంటే చంద్రబాబు కేవలం 7,900 పోస్టులకు డీఎస్సీ ఇచ్చారు. మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ పెడతామని ప్రతి పిల్లవాడికీ చెబుతున్నా"-ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ

పోస్టులు మింగేసిన మంత్రదండం.. ప్రాథమిక విద్యలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపు కోసమంటూ ప్రపంచ బ్యాంకుతో కలిసి పాఠశాల విద్యాశాఖ ‘ఆంధ్ర అభ్యసన పరివర్తన’ ప్రాజెక్టు చేపట్టింది. ఇందుకు ప్రపంచ బ్యాంకు రూ.1,862 కోట్లు రుణంగా అందిస్తుంది. ఇందులో భాగంగా అదనపు నియామకాలను కనీస స్థాయిలో ఉంచడం ద్వారా డిపార్ట్‌మెంట్‌ మానవ వనరులపై చేసే వ్యయాన్ని తగ్గిస్తామని ప్రభుత్వమే నిబంధన పెట్టింది. ఇది ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభావం చూపింది. ఈ ప్రభుత్వం వచ్చాక నిర్వహించిన బదిలీల సమయంలో 15వేల పోస్టులను బ్లాక్‌ చేసింది. 3-10 తరగతులు ఉన్న బడుల్లో 6,578మంది, 6-10 తరగతులకు 1,350 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు అవసరం కానున్నట్లు అధికారులు గతంలో లెక్కలు తేల్చారు. ఇప్పుడు వీటిని సర్దుబాటు చేసేశారు.

మాయాజాలం ఇలా
మాయ-1: 1-8 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమం ఒక్కటే అమలు చేశారు. దీంతో ఇప్పటి వరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉండగా.. తెలుగు మాధ్యమం వారిని మిగులుగా తేల్చి వీరిని సర్దుబాటు చేసేశారు. ఒకే మాధ్యమం అమలును ఒక్కో ఏడాది పొడిగించుకుంటూ వచ్చే ఏడాది తొమ్మిది, ఆ తర్వాత పదో తరగతికి అమలు చేయనున్నారు. అంటే భవిష్యత్తులోనూ ఖాళీలు వచ్చే పరిస్థితి లేదు.

మాయ-2: తరగతిలోని సెక్షన్లలో విద్యార్థుల సంఖ్యను పెంచేశారు. 9, 10 తరగతుల్లో 60మంది వరకు ఒకే సెక్షన్‌ చేయగా.. 6-8 తరగతులకు 52 మంది వరకు ఒక్కటే సెక్షన్‌గా పెట్టారు.దీంతో ఉపాధ్యాయుల అవసరం తగ్గిపోయింది.

మాయ-3: 3 నుంచి 10 తరగతులు ఉండే హైస్కూల్‌లో 137మందికి పైగా విద్యార్థులు ఉంటేనే ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ పోస్టును ఇచ్చారు. దీంతో చాలా బడులకు ఈ రెండు పోస్టులు పోయాయి.

మాయ-4: 6-10 తరగతులున్న పాఠశాలలో 92మందికిపైగా పిల్లలు ఉంటేనే ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారు. పిల్లలు తక్కువగా ఉన్నచోట పోస్టులు రద్దైపోయాయి.

మాయ-5: 3-8 తరగతులున్న బడుల్లో 98 మందిలోపు ఉంటే సబ్జెక్టు ఉపాధ్యాయులను తీసేశారు. ఇలాంటి చోట 30మందికి ఒక్క సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ) చొప్పున కేటాయించారు. మూడో తరగతికి సబ్జెక్టు ఉపాధ్యాయుడితో బోధిస్తామని చెప్పిన ప్రభుత్వం పిల్లలు తక్కువగా ఉన్నారని, ఇక్కడ ఈ నిబంధనకు ఎగనామం పెట్టింది.

మాయ-6: 3, 4, 5 తరగతులకు సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధనంటూ కొత్త విధానాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కిలోమీటరు దూరంలోని 4,731 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4 ,5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత బడులకు తరలించేశారు. అదనపు గదులు లేనందున 8,412 బడుల తరలింపు పెండింగ్‌లో పెట్టారు. గదుల నిర్మాణం పూర్తయితే వీటిని తరలించేస్తారు. విలీనం కారణంగా 1, 2 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. 20లోపు పిల్లలు ఉన్న 6,755 బడులు ఏకోపాధ్యాయడితో కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో దీన్ని రెండు, మూడు కిలోమీటర్లకు విస్తరిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇదే జరిగితే భవిష్యత్తులో ఉపాధ్యాయ పోస్టులు ఇంకా భారీగా తగ్గిపోతాయి. తరగతుల విలీనంతో ఎస్జీటీలకు వందశాతం పదోన్నతులు ఇచ్చి, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయులుగా సర్దుబాటు చేసేశారు.

ఉన్నవాటినీ రద్దు చేసేశారు..
కొత్త నియామకాలు దేవుడెరుగు.. ఉన్న పోస్టులనే రద్దు చేసేశారు. ఆదర్శ పాఠశాలల్లోని 3,260 పోస్టులకు సర్వీసు నిబంధనల కోసమంటూ 4,764 ఎస్జీటీ పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. కర్నూలు జిల్లా మినహా ఉమ్మడి 12 జిల్లాల్లో 397 చొప్పున పోస్టులను విలీనం చేసింది.

* నూతన జాతీయ విద్యా విధానంలో ఆర్ట్‌, క్రాఫ్ట్‌ పోస్టులకు ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వం మాత్రం వీటిని రద్దు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,145 ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసింది.

* అయిదు అదనపు డైరెక్టర్ల పోస్టులను సృష్టించేందుకు 2021 అక్టోబరులో మరో 15 ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ ఉపాధ్యాయ పోస్టులను విలీనం చేశారు.

* రాష్ట్రవ్యాప్తంగా 1,79,263 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా.. హేతుబద్ధీకరణతో వీటిని 1,50,641కి కుదించేసింది. దీనికి డీఎస్సీ-98 ఒప్పంద పోస్టులను మినహాయిస్తే వచ్చే ఖాళీలు 5,251లను కలిపినా.. సర్దుబాటు కింద 23వేలకుపైగా పోస్టులు పోయాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.