గుంటూరులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు, భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నాలక్ష్మినారాయణ వెల్లడించారు. శాంతిభద్రతలు, ఇసుక పాలసీ, దేవాలయభూముల అన్యాక్రాంతం వంటి అంశాలను నిరసిస్తూ సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. గురజాల ఆర్డీవో కార్యాలయ సమీపంలోని మైదానంలో ఈ సభ జరుగుతుందని చెప్పారు. ఈ సభకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇంచార్జ్ సునిల్ దేవ్ ధర్ హాజరవుతారని కన్నా తెలిపారు. భాజపాలో చేరుతున్న వారిపై,వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. .
ఇదీ చూడండి: 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి బొత్స