సినీ సంగీత దర్శకుడు సాయి కార్తీక్తో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హైదరాబాద్లో భేటీ అయ్యారు. పల్నాడు జిల్లా ఏర్పాటు ఆవశ్యకత, పల్నాటి చరిత్ర గురించిన పాటలు రూపొందించడం కోసం కార్తీక్ను కలిశారు. చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని పల్నాటి ఉద్యమం మీద 4 పాటలు రూపొందించాల్సిందిగా కోరారు. మహిళలు, యువత, దేవాలయాలు, ఉద్యమ వీరులపై పాటలు రూపొందించనున్నారు. వచ్చే సంక్రాంతికి వీటిని విడుదల చేస్తామని యరపతినేని తెలిపారు.
ఇవీ చదవండి..