ETV Bharat / state

రెండో వివాహమే.. ఆమె హత్యకు కారణమా..?

author img

By

Published : Dec 1, 2020, 10:52 AM IST

గుంటూరు జిల్లా ఓబుల నాయుడుపాలెంలో మహిళ హత్యకు గురికావటం సంచలనం రేపింది. కొంత కాలం క్రితం హత్యకు గురైన మహిళ మరో వర్గానికి చెందిన వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఈ కారణంగానే ఆస్తి తగాదాలతో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Woman murdered in Obula Naidupalem
ఓబుల నాయుడుపాలెంలో మహిళ హత్య

గుంటూరు నగర శివారు ఓబుల నాయుడుపాలెనికి చెందిన ఏమినేడి వాణిశ్రీ (48) దారుణ హత్యకు గురయ్యింది. చౌడవరం పరిధిలోని దాసరిపాలెం గ్రామానికి చెందిన ఆమె కొంత కాలం క్రితం ఏమినేడి చెన్నయ్య గౌడ్​ను రెండో వివాహం చేసుకుంది. కులాంతర వివాహం కావటం.. భర్త తరఫు బంధువులతో తరుచు ఆస్తి విషయంలో పలుమార్లు గొడవలు జరిగాయి. వీరికి కుమారుడు జన్మించిన అనంతరం గొడవలు మరింత పెద్దవి అయ్యాయి. ఈ విషయమై వాణిశ్రీ గత నెలలో నల్లపాడు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

స్పందించిన పోలీసులు.. వివాదానికి సంబంధించిన పలువురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇంతలో.. వాణిశ్రీ హత్యకు గురైంది. రాత్రి 7 గంటల సమయంలో కొందరు యువకులు ముసుగులు వేసుకొని వచ్చి కత్తులతో దాడి చేసి హతమార్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. హత్యలో ఎంతమంది పాల్గొన్నారు? ఈ ఘటన ఆస్తి వివాదం కారణంగానే జరిగిందా? మరేదైనా అంశం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు.

గుంటూరు నగర శివారు ఓబుల నాయుడుపాలెనికి చెందిన ఏమినేడి వాణిశ్రీ (48) దారుణ హత్యకు గురయ్యింది. చౌడవరం పరిధిలోని దాసరిపాలెం గ్రామానికి చెందిన ఆమె కొంత కాలం క్రితం ఏమినేడి చెన్నయ్య గౌడ్​ను రెండో వివాహం చేసుకుంది. కులాంతర వివాహం కావటం.. భర్త తరఫు బంధువులతో తరుచు ఆస్తి విషయంలో పలుమార్లు గొడవలు జరిగాయి. వీరికి కుమారుడు జన్మించిన అనంతరం గొడవలు మరింత పెద్దవి అయ్యాయి. ఈ విషయమై వాణిశ్రీ గత నెలలో నల్లపాడు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

స్పందించిన పోలీసులు.. వివాదానికి సంబంధించిన పలువురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇంతలో.. వాణిశ్రీ హత్యకు గురైంది. రాత్రి 7 గంటల సమయంలో కొందరు యువకులు ముసుగులు వేసుకొని వచ్చి కత్తులతో దాడి చేసి హతమార్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. హత్యలో ఎంతమంది పాల్గొన్నారు? ఈ ఘటన ఆస్తి వివాదం కారణంగానే జరిగిందా? మరేదైనా అంశం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు.

ఇవీ చూడండి:

రక్తహీనత బాధితుల గుర్తింపులో జాప్యం.. యాభై శాతం కూడా దాటని సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.