ETV Bharat / state

'పోలవరం రివర్స్​ టెండరింగ్​ తో రూ.58 కోట్లు ఆదా' - polavaram reverse tendering minister comments

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ తో రూ.58 కోట్లు ఆదాయ అయిందని, జలవనరుల శాఖ మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్ వెల్లడించారు. రివర్స్ టెండరింగ్ లో పాత కాంట్రాక్టర్లను పాల్గొనవద్దని,తామెక్కడా చెప్పలేదని మంత్రి తెలిపారు.

మంత్రి అనిల్​కుమార్​ యాదవ్​
author img

By

Published : Sep 21, 2019, 12:28 PM IST

'పోలవరంలో రివర్స్​ టెండరింగ్​ ద్వారా రూ.58 కోట్లు ఆదా'

పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ తో రూ.58 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఇదే ఒరవడితో ప్రాజెక్టులన్నింటిలోనూ పారదర్శక విధానం తీసుకొస్తామని తెలిపారు. రివర్స్ టెండరింగ్ లో పాత కాంట్రాక్టర్లను పాల్గొనవద్దని, తామెక్కడా చెప్పలేదని వెల్లడించారు. తెదేపా నేతలు కావాలనే రాజకీయం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. తెదేపా హయాంలో ఎక్కువకు కోట్ చేసిన మాక్స్ ఇన్ ఫ్రా సంస్థ ఇప్పుడు తక్కువకు కోట్ చేయడమే దీనికి నిదర్శనమని వెల్లడించారు. నవయుగ సంస్థను కూడా టెండర్లలో పాల్గొనవచ్చని ఆయన సూచించారు. గత ప్రభుత్వం టెండర్లలో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని విమర్శించారు. ఇకనైనా తెదేపా నేతలు అసత్యాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.

ఇదీ చూడండి : కర్నూలు జిల్లా వరద ప్రభావిత ప్రాంతల్లో సీఎం పర్యటన

'పోలవరంలో రివర్స్​ టెండరింగ్​ ద్వారా రూ.58 కోట్లు ఆదా'

పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ తో రూ.58 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఇదే ఒరవడితో ప్రాజెక్టులన్నింటిలోనూ పారదర్శక విధానం తీసుకొస్తామని తెలిపారు. రివర్స్ టెండరింగ్ లో పాత కాంట్రాక్టర్లను పాల్గొనవద్దని, తామెక్కడా చెప్పలేదని వెల్లడించారు. తెదేపా నేతలు కావాలనే రాజకీయం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. తెదేపా హయాంలో ఎక్కువకు కోట్ చేసిన మాక్స్ ఇన్ ఫ్రా సంస్థ ఇప్పుడు తక్కువకు కోట్ చేయడమే దీనికి నిదర్శనమని వెల్లడించారు. నవయుగ సంస్థను కూడా టెండర్లలో పాల్గొనవచ్చని ఆయన సూచించారు. గత ప్రభుత్వం టెండర్లలో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని విమర్శించారు. ఇకనైనా తెదేపా నేతలు అసత్యాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.

ఇదీ చూడండి : కర్నూలు జిల్లా వరద ప్రభావిత ప్రాంతల్లో సీఎం పర్యటన

Intro:పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు


Body:ఉదయగిరి నియోజకవర్గంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి కనిపించారు. అయితే పోలింగ్ కేంద్రాలలో ఈవీఎం లు మొరాయించడంతో పోలింగ్ నిలిచిపోయింది. నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి మండలంలోని గండిపాలెం గ్రామంలో 32 పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కొనసాగలేదు. అలాగే మండల కేంద్రమైన జలదంకి లోని 291 పోలింగ్ కేంద్రంలో ఎంపీ ఓటింగ్ కు సంబంధించిన ఈ వి ఎం మరణించడంతో పోలింగ్ కొనసాగలేదు. ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు అసంతృప్తి చెందారు. ఈవీఎంలను సిద్ధం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


Conclusion:ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.