వైకాపా అధినేత జగన్ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన ఆ పార్టీ నాయకులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని నగరాలకు చెందిన పలువురు గతంలో మొక్కుకున్నారు. వీరిలో జగన్తో పాటు పాదయాత్రలో మొదటి నుంచి పాల్గొన్న పురుషోత్తం ఉన్నారు. పాదయాత్రగా వెళ్లి స్వామి వారికి మొక్కులు చెల్లించే నాయకులకు పలువురు అభినందనలు తెలిపారు.
ఇవీ చదవండి