ETV Bharat / state

'బీటెక్ విద్యార్థిని హత్యకేసు విచారణలో జాప్యం' - బీటెక్ విద్యార్థిని హంతకుడు నాగేంద్రబాబు ఆరోగ్యంపై జీజీహెచ్ హెల్త్ బులెటిన్

కత్తిపోట్లతో గుంటూరు ఆస్పత్రిలో చేరిన.. విజయవాడ బీటెక్ విద్యార్థిని హత్యకేసు నిందితుడు నాగేంద్రబాబు డిశ్చార్జ్​కు మరింత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స జరిగిన ప్రదేశంలో ఇన్​ఫెక్షన్ సోకిందని గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతి వెల్లడించారు. అతడు పూర్తిగా కోలుకున్న తర్వాతే పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.

health bulletin of murderer nagendra babu
నాగేంద్రబాబు ఆరోగ్య స్థితిని వివరిస్తున్న జీజీహెచ్ సూపరింటెండెంట్
author img

By

Published : Oct 31, 2020, 12:40 AM IST

విజయవాడలో బీటెక్ విద్యార్థిని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబును.. డిశ్చార్జ్ చేయడానికి మరికొంత సమయం పడుతుందని గుంటూరు సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తెలిపారు. శరీరంలో పలుచోట్ల కత్తిపోట్లు ఉండగా.. రోగ నిరోధకశక్తి బాగా తగ్గిందని వెల్లడించారు. శస్త్ర చికిత్స నిర్వహించిన ప్రదేశంలో ఇన్​ఫెక్షన్ వచ్చిందన్నారు. యాంటీబయాటిక్స్ ఇచ్చి వైద్యం చేస్తున్నామని పేర్కొన్నారు.

నాగేంద్రబాబు పూర్తిగా కోలుకున్న తర్వాతే పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపనున్నారు. హత్యకు గల కారణాలు అతని ద్వారానే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు ఆ యువతి మృతి.. ఒక మిస్టరీగానే మిగలనుంది.

విజయవాడలో బీటెక్ విద్యార్థిని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబును.. డిశ్చార్జ్ చేయడానికి మరికొంత సమయం పడుతుందని గుంటూరు సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తెలిపారు. శరీరంలో పలుచోట్ల కత్తిపోట్లు ఉండగా.. రోగ నిరోధకశక్తి బాగా తగ్గిందని వెల్లడించారు. శస్త్ర చికిత్స నిర్వహించిన ప్రదేశంలో ఇన్​ఫెక్షన్ వచ్చిందన్నారు. యాంటీబయాటిక్స్ ఇచ్చి వైద్యం చేస్తున్నామని పేర్కొన్నారు.

నాగేంద్రబాబు పూర్తిగా కోలుకున్న తర్వాతే పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపనున్నారు. హత్యకు గల కారణాలు అతని ద్వారానే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు ఆ యువతి మృతి.. ఒక మిస్టరీగానే మిగలనుంది.

ఇదీ చదవండి: పోలీసుల పేరుతో వసూళ్లు..ఐదుగురు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.