ETV Bharat / state

తితిదే ఆస్తుల వేలంపై హైకోర్టులో విచారణ

author img

By

Published : Aug 6, 2020, 2:21 PM IST

తితిదే ఆస్తుల వేలంపై దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ ప్రస్తావించిన అంశాలతో పాటు.. వేలం విషయంలో తీసుకున్న చర్యలపై వివరణతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని ద్విసభ్య ధర్మాసనం సూచించింది.

ttd lands auction sale petition in high court
తితిదే ఆస్తుల వేలంపై హైకోర్టులో విచారణ

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల వేలం పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. వేలం ప్రక్రియను మే నెలలోనే నిలిపివేశామనీ.. దీనికి సంబంధించి మే 28, గత నెల 30వ తేదీన వివరాలు సమర్పించినట్లు తితిదే స్టాడింగ్ కౌన్సిల్ సభ్యులు, హైకోర్టు సీనియర్ న్యాయవాది డాక్టర్ మజ్జి సూరిబాబు తెలిపారు. పిటిషనర్ ప్రస్తావించిన అంశాలతో పాటు, వేలం విషయంలో తీసుకున్న చర్యలపై సమగ్రమైన వివరణతో కౌంటర్​ దాఖలు చేయాలని ద్విసభ్య ధర్మాసనం సూచించింది. తితిదే భూములు విక్రయించటం అన్యాయమని.. భవిష్యత్తులో కూడా భూములు విక్రయించకుండా ఉండేందుకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రత్యేకంగా ఒక జ్యూడిషియల్ కమిటీ వేసి, ఆస్తులను వాటి పర్యవేక్షణలో ఉంచాలని పిటిషనర్ ధర్మాసనాన్ని కోరారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల వేలం పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. వేలం ప్రక్రియను మే నెలలోనే నిలిపివేశామనీ.. దీనికి సంబంధించి మే 28, గత నెల 30వ తేదీన వివరాలు సమర్పించినట్లు తితిదే స్టాడింగ్ కౌన్సిల్ సభ్యులు, హైకోర్టు సీనియర్ న్యాయవాది డాక్టర్ మజ్జి సూరిబాబు తెలిపారు. పిటిషనర్ ప్రస్తావించిన అంశాలతో పాటు, వేలం విషయంలో తీసుకున్న చర్యలపై సమగ్రమైన వివరణతో కౌంటర్​ దాఖలు చేయాలని ద్విసభ్య ధర్మాసనం సూచించింది. తితిదే భూములు విక్రయించటం అన్యాయమని.. భవిష్యత్తులో కూడా భూములు విక్రయించకుండా ఉండేందుకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రత్యేకంగా ఒక జ్యూడిషియల్ కమిటీ వేసి, ఆస్తులను వాటి పర్యవేక్షణలో ఉంచాలని పిటిషనర్ ధర్మాసనాన్ని కోరారు.

ఇదీ చదవండి: 'రామమందిర భూమిపూజ ఎస్​వీబీసీ ఎందుకు ప్రసారం చేయలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.