ETV Bharat / state

ఈత కల్లు తాగిన ముగ్గురికి అస్వస్థత - guntur crime news

లాక్​డౌన్ వల్ల మద్యం దొరక్కపోవటం, దొరికినా ధరలు అధికంగా ఉండటంతో మందు బాబులు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురవతున్నారు. గుంటూరు జిల్లాలో ఈత కల్లు తాగి ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు.

Three people fell ill after drinking toddy
Three people fell ill after drinking toddy
author img

By

Published : Aug 5, 2020, 8:04 PM IST

గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో ఈత కల్లు తాగి ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. పేటేరు గ్రామానికి చెందిన ఏ.రాజు(35), అల్లంసెట్టి శివయ్య(45), శొంఠి శివ నాగేశ్వరరావు(49) ఈత కల్లు కొని తాగారు. తాగిన కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన బంధువులు ఇద్దరిని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరొకరిని పోలీసులే ఆసుపత్రికి తీసుకొచ్చారు.

బాధితులకు ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు.. ప్రాణాపాయం లేదన్నారు. అనంతరం వారిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో ఈత కల్లు తాగి ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. పేటేరు గ్రామానికి చెందిన ఏ.రాజు(35), అల్లంసెట్టి శివయ్య(45), శొంఠి శివ నాగేశ్వరరావు(49) ఈత కల్లు కొని తాగారు. తాగిన కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన బంధువులు ఇద్దరిని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరొకరిని పోలీసులే ఆసుపత్రికి తీసుకొచ్చారు.

బాధితులకు ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు.. ప్రాణాపాయం లేదన్నారు. అనంతరం వారిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి

ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన సీఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.